Pakistan ISI Conspiracy: పాకిస్తాన్ దేశంలో తినడానికి తిండి ఉండదు. తాగడానికి నీళ్లు ఉండవు. నడవడానికి రోడ్డు కూడా ఉండదు. అసలు అక్కడ బతకడానికి అవకాశం కూడా ఉండదు. ప్రజలు దుర్భరమైన దారిద్రంలో జీవిస్తుంటారు. పేదరికంలో బతికీడుస్తూ ఉంటారు. కానీ పాలకులు మాత్రం భారతదేశం మీద విషం చిమ్ముతూ ఉంటారు. ప్రపంచ దేశాల వద్ద అప్పులు తెచ్చి.. భారత వ్యతిరేక కార్యకాల పాలకు పాల్పడుతుంటారు. ఉగ్రవాదులతో అంట కాగి.. భారత దేశంలో దారుణాలు చేసేందుకు రూపకల్పన చేస్తుంటారు.
పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ మన దేశంలో అనేక ప్రాంతాలలో దాడులు చేసేందుకు రూపకల్పన చేసింది.. దీనికోసం ఒక ముఠాను ఏర్పాటు చేసుకుంది..ఈ ముఠాలో మొత్తం ఎనిమిది మంది ఉగ్ర సభ్యులు ఉన్నారు. వీరందరిని మన దేశ ఇంటలిజెన్స్ వర్గాలు పట్టుకున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ, చంటిగాడు ప్రాంతాలలో నిర్వహించిన తనిఖీలలో ఈ ముఠా సభ్యులు పట్టుపడ్డారు. కీలకమైన వంతెనలు.. రైల్వే స్టేషన్లు.. పార్కులు.. వంతెనలు.. ఢిల్లీలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కార్యాలయాలను వీరు లక్ష్యంగా చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో విజయ్ అలియాస్ షూటర్.. నితీష్ పాశ్వాన్.. రిజ్వాన్ అహ్మద్.. షేక్ అహ్మద్.. సాజిద్ మహబూబ్.. షేక్ అలియాస్ అర్బాజ్ ఖాన్.. హర్విందర్ సింగ్.. గగన్ దీప్ సింగ్.. మన్ జీత్ సింగ్.. కామీలామ ఉన్నారు. వీరంతా కూడా ఐఎస్ఐ తో కుమ్మక్కయ్యారు.
ఇటీవల కాలంలో మన దేశ భద్రత సంస్థలు అత్యంత గోప్యంగా తనిఖీలు చేపడుతున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదుల కదలికల మీద ఆరా తీస్తున్నాయి. పాకిస్తాన్ దేశానికి సరిహద్దుల్లో ఉన్న ఉత్తర ప్రదేశ్.. రాజస్థాన్.. ఢిల్లీ.. గుజరాత్ వంటి రాష్ట్రాలలో పటిష్టంగా తనిఖీలు చేపడుతున్నాయి. ఈ తనిఖీలలో ఉగ్రవాదుల డొంకలు కదులుతున్నాయి. అయితే వీరందరికీ కూడా ఐఎస్ఐ తో సంబంధం ఉండడం ఆందోళన కలిగిస్తోంది. సరిహద్దుల్లో పటిష్టమైన భద్రత నిర్వహిస్తున్నప్పటికీ.. స్లీపర్ సెల్స్ మాదిరిగా వీరు పని చేయడం.. దేశంలో విధ్వంసానికి కుట్ర చేయడం ఆందోళన కలిగిస్తోంది.
వీరి వెనుక కేవలం పాకిస్తాన్ ఐఎస్ఐ మాత్రమే కాకుండా.. ఇంకా అనేక రకాల ఉగ్రవాద సంస్థలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సంస్థలకు గల్ఫ్ దేశాల నుంచి భారీగా డబ్బులు వస్తున్నట్లు సమాచారం. ఆ డబ్బులను ఉగ్రవాద కార్యకలాపాల కోసం వాడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా అరెస్టయిన ఈ 8 మంది ముఠా సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా దేశవ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ లెక్కన పాకిస్తాన్ ఐఎస్ఐ మనదేశంలో భీకరమైన ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
