spot_img
Homeజాతీయ వార్తలుOdisha Bank Incident: మా అక్క చనిపోయిందన్నాడు..బ్యాంకర్లు నమ్మలేదు.. అస్తిపంజరం తీసుకొచ్చాడు.. గుండెలను మెలిపెట్టే యదార్థం...

Odisha Bank Incident: మా అక్క చనిపోయిందన్నాడు..బ్యాంకర్లు నమ్మలేదు.. అస్తిపంజరం తీసుకొచ్చాడు.. గుండెలను మెలిపెట్టే యదార్థం ఇదీ

Odisha Bank Incident: ఒక మనిషి చావు విషయంలో ఎవరూ అబద్ధం చెప్పరు.. కానీ మనదేశంలో బ్యాంకర్లు మాత్రం చావును కూడా అబద్ధమని అనుకుంటారు. అందుకే ప్రతి దానికి వారు ఆధారం అడుగుతారు. మోసం చేసే వారి విషయంలో ఏమాత్రం అప్రమత్తంగా ఉండని బ్యాంకర్లు.. పేదల విషయంలో మాత్రం అడుగడుగునా నిబంధనలు విధిస్తుంటారు. వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంటారు. చివరికి వారి ఖాతాలో డబ్బు తీసుకునే విషయంలో కూడా బ్యాంకర్లు పెట్టే కొర్రీలు సామాన్యులకు నరకం చూపిస్తుంటాయి. అటువంటి నరకమే ఇతడు అనుభవించాడు. చివరికి బ్యాంకర్ల తిక్క కుదిరే విధంగా ప్రవర్తించాడు.

అది ఒడిశా రాష్ట్రం. కియోయొంజర్ జిల్లాలో దియా నాలి అనే గ్రామం ఉంది. ఇక్కడ జీతూ ముండా అనే వ్యక్తి ఉన్నాడు . ఇతడికి కాక్రా అనే చౌదరి ఉంది. ఈమెకు ఒడిశా గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. కాక్రా రెండు నెలల క్రితం చనిపోయింది. అంతకుముందే ఆమె భర్త, కుమారుడు కూడా చనిపోయారు. దీంతో కాక్రా కుటుంబ సభ్యుడిగా జీతు మాత్రమే ఉన్నాడు. ఆమె కథలు 19, 300 ఉన్నాయి. వాటిని విత్ డ్రా చేసుకోవడానికి జీతూ బ్యాంకు అధికారులను సంప్రదించాడు. డబ్బు విత్ డ్రా చేసుకోవాలంటే ఖాతా కలిగిన వ్యక్తి కచ్చితంగా ఉండాలని.. అతడు తప్పనిసరిగా హాజరుకావాలని.. ఒకవేళ జీవించలేని పక్షంలో మరణ ధ్రువీకరణ పత్రం.. ఇతర వారసత్వ పత్రాలు సమర్పించాలని బ్యాంకు అధికారులు సూచించారు. డబ్బు ఇవ్వడానికి బ్యాంక్ అధికారులు ఒప్పుకోలేదు.

బ్యాంకు అధికారులు సూచించిన పత్రాలు జీతూ వద్ద లేవు. జీతూ అనేక సందర్భాల్లో బ్యాంకు అధికారులను సంప్రదించాడు. అతడు వెళ్లిన ప్రతి సందర్భంలోనూ బ్యాంకు అధికారులు ఇలానే మాట్లాడటం మొదలుపెట్టారు. దీంతో అతనిలో సహనం నశించిపోయింది. వెంటనే స్మశాన వాటికకు వెళ్లి.. తన సోదరి అవశేషాలను తవ్వి తీశాడు. ఆమె ఆస్తిపంజరాన్ని ఒక వస్త్రంలో చుట్టి బ్యాంకు వద్దకు తీసుకెళ్లాడు. ఆ ఆస్తిపంజరం చూసిన బ్యాంకు అధికారులు భయపడ్డారు. వెంటనే పోలీసులకు విషయాన్ని చెప్పారు. పోలీసులు అక్కడికి చేరుకొని.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. డబ్బు జీతూ అందించే విధంగా బ్యాంకు అధికారులతో చర్చలు జరిపారు.

ఒక మనిషి చనిపోయిన విషయంలో ఎవరు కూడా అబద్ధం చెప్పరు. కానీ బ్యాంకు అధికారులకు ఆధారాలు మాత్రమే కావాలి. మనిషి చనిపోయాడని చెబుతున్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టించకుండా బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అసలే అతడు నిరక్షరాస్యుడు.. పైగా ఆదివాసి.. ఇటువంటి సమయంలో అతడు ఆధారాలు ఎక్కడ నుంచి తీసుకొస్తాడు.. అతడు తన సోదరి చనిపోయిందని చెప్పినప్పుడు బ్యాంకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి కదా.. అలా చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం చివరికి పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version