Homeఆంధ్రప్రదేశ్‌Jagan- Chandrababu: జగన్, చంద్రబాబు ఎవరు గెలిచినా ముందుంది ముసళ్లపండుగే

Jagan- Chandrababu: జగన్, చంద్రబాబు ఎవరు గెలిచినా ముందుంది ముసళ్లపండుగే

Jagan- Chandrababu: ఇప్పుడు ఏపీలో ‘సంక్షేమమే’ తారక మంత్రం. ప్రజలను ఆకర్షించగల ఒక యుద్ధ తంత్రంగా మారిపోయింది. వారి కంటే మేము ఎక్కువ ఇస్తామంటేనే ప్రజలు అటువైపుగా చూసేటంతటి పరిస్థితి దాపురించింది. పథకాలు వద్దు మంచి పాలన అందిస్తామని ప్రకటించినా ప్రజలు పట్టించుకోరు. అంతలా వారిపై సంక్షేమ పథకాలు ప్రభావం చూపుతున్నాయి. అందుకే జగన్ సర్కారు అభివృద్ధిని పక్కనపెట్టి మరీ ప్రజలను సంతృప్తి పెట్టే పనిలో ఉంది. నెలకు ఠంచనుగా సామాజిక పింఛన్లు అందిస్తున్న ప్రభుత్వం.. పాలనలో భాగమైన ఉద్యోగులకు మాత్రం నెలలో మూడో వారం వరకూ జీతాలు చెల్లిస్తూనే ఉంది. అటు అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. వారు న్యాయస్థానాల తలుపులు తట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

Jagan- Chandrababu
Jagan- Chandrababu

అయితే ప్రజల మనసును గుర్తెరిగిన జగన్ సంక్షేమంతోనే బలమైన ఓటు బ్యాంక్ సృష్టించుకున్నారు. కానీ దానిని నిలబెట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో వనరులు సరిపోవని తెలిసినా వెనక్కి తగ్గడం లేదు. అప్పులు తెచ్చి మరీ అమలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఇవే అధికారాన్ని అందిస్తాయని జగన్ బలంగా నమ్ముతున్నారు. అయితే విపక్షాలు సైతం సంక్షేమం వద్దు అనే మాట నేరుగా చెప్పలేకపోతున్నారు. అలా అంటే ప్రజలు దూరమైపోతారన్న ఆందోళన వారిది. అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాత్రమే మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని దివాలా దిశగా మార్చేశారని మాత్రమే ఆరోపణలు చేయగలుగుతున్నారు. అంతకు మించి ఒక్క మాట అనలేకపోతున్నారు. అదే సమయంలో తాము సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ప్రకటనలు ఇస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల లబ్ధిపొందుతున్న వారు మాత్రం అవి కొనసాగాలని కోరుతున్నారు. అవసరమైతే ఇప్పుడున్న లబ్ధి కంటే పెంపును ఎక్కువ మంది ఆశిస్తున్నారు. అది ఎవరు ఇస్తామంటే వారికి సపోర్టు చేయడానికి సిద్ధపడుతున్నారు. అయితే లబ్ధిదారుల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల వారే. వారికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి… ప్రభుత్వం అప్పులు చేస్తోందా? లేకుంటే రాష్ట్రం దివాలా తీస్తుందా? అన్నది ఆలోచించరు. అందుకే వీలైనంత ప్రభుత్వం నుంచి ఎక్కువ లబ్ధికి ఆశిస్తున్నారు. ప్రస్తుతం జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగింపు కోరుకుంటూనే కొత్త పథకాల కోసం కూడా ఎదురుచూస్తున్నారు. కానీ పెంచే పరిస్థితి ప్రభుత్వాల వద్ద ఉందా? అంటే అది మచ్చుకైనా కనిపించదు. అందుకే వచ్చే ఎన్నికల తరువాత ఎవరు గద్దెనెక్కిన వారికి గడ్డుకాలమే.

Jagan- Chandrababu
Jagan- Chandrababu

చంద్రబాబు సంక్షేమానికి ఒప్పుకోడని ఆ మధ్య సీనియర్ మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. చంద్రబాబు పాలన వరకే కానీ.. ప్రజలకు నేరుగా ఇవ్వడానికి ఇష్టపడరు అని సంకేతం వచ్చేలా ధర్మాన మాట్లాడారు. వైసీపీ శ్రేణులు కూడా ఇప్పుడు ఆ వ్యాఖ్యలనే ఆదర్శంగా తీసుకొని వైరల్ చేస్తున్నాయి. అయితే దానిపై చంద్రబాబు కూడా జాగ్రత్తపడ్డారు. జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తానని చెబుతూనే.. మరికొన్ని పథకాలు యాడ్ చేస్తానని ప్రకటనలు జారీచేస్తున్నారు. అటు వ్యూహకర్త రాబిన్ శర్మ చేతికి పనికూడా చెప్పారు. వైసీపీకి మించి పథకాలు రూపొందించాలని.. అవి ప్రజలకు ఆలోచింపజేసే విధంగా ఉండాలని కోరారుట. త్వరలో నవరత్నాల మాదిరిగా టీడీపీ కూడా ఒక మేనిఫెస్టో విడుదల చేసే చాన్స్ కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version