జేసీ సోదరులకు త్వరలో మరో ఉచ్చు

సుదీర్ఘకాలంగా అనంతపూర్ జిల్లాలో తిరుగులేని నాయకులుగా చెలామణి కావడమే కాకుండా, రాష్ట్ర రాజకీయాలపై తమదైన ప్రత్యేక ముద్ర వేస్తూ వచ్చిన జేసీ సోదరులకు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగలక తప్పడం లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని, చట్టాలను తుంగలోకి నెట్టివేసి ఇష్టారాజ్యంగా సాగించిన వారి గత వ్యవహారాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఒకొక్కటి పైకి తీసుకొస్తూ ఉండడంతో అనేక కేసులలో ఇరుక్కోవలసి వస్తున్నది. తాజాగా జేసీ సోదరులకు త్వరలో మరో ఉచ్చు బిగుసుకోబోతోంది. నాగాలాండ్‌లో స్క్రాప్‌లో అశోక్ […]

Written By: Neelambaram, Updated On : February 24, 2020 6:32 pm
Follow us on

సుదీర్ఘకాలంగా అనంతపూర్ జిల్లాలో తిరుగులేని నాయకులుగా చెలామణి కావడమే కాకుండా, రాష్ట్ర రాజకీయాలపై తమదైన ప్రత్యేక ముద్ర వేస్తూ వచ్చిన జేసీ సోదరులకు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగలక తప్పడం లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని, చట్టాలను తుంగలోకి నెట్టివేసి ఇష్టారాజ్యంగా సాగించిన వారి గత వ్యవహారాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఒకొక్కటి పైకి తీసుకొస్తూ ఉండడంతో అనేక కేసులలో ఇరుక్కోవలసి వస్తున్నది.

తాజాగా జేసీ సోదరులకు త్వరలో మరో ఉచ్చు బిగుసుకోబోతోంది. నాగాలాండ్‌లో స్క్రాప్‌లో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన నిషేధిత బీఎస్-3 లారీలను బీఎస్-4గా మార్చి నకిలీ డాక్యుమెంట్లతో వాటిని జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ విక్రయించినట్లు రవాణా శాఖ గుర్తించింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

మొత్తం 68 లారీలు అక్రమంగా విక్రయించినట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ గుర్తించి ఆ మేరకు చేసిన ఫిర్యాదుతో తొలుత ఎఫ్‌ఐఆర్ ఉంది. ఈ కేసుకు పొడిగింపుగా రెండు, మూడు రోజుల్లో మరో కేసు నమోదు చేయడానికి రవాణా శాఖ పకడ్బందీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి అక్రమాలకు సంబంధించి వందలాది లారీలు తిరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఇంకా లోతుగా విచారణ జరిపిన రవాణా శాఖ మరో 86 లారీలు ఉన్నట్లు గుర్తించింది. వీటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సంబంధిత అధికారులు సేకరించారు.

దీంతో జేసీ సోదరులకు నోటీసులిచ్చి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. తొలుత నమోదైన కేసులో అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బీఎస్-3 లారీలను కొన్నట్లు రవాణా శాఖ అధికారులు సమగ్ర విచారణలో తేల్చిన విషయం విదితమే.

జేసీ సోదరులు పాల్పడిన లారీల కుంభకోణంలో మొత్తంగా 154 (తొలి 68 లారీలు కలిపి) ఉన్నట్లు గుర్తించామని అధికారులు నిర్ధారిస్తున్నారు.