India US Relations: అమెరికా ముందు వంగిపోయాడు. అమెరికా ముందు లొంగిపోయాడు. అమెరికా చెబితే భయపడిపోయాడు.. ఇదిగో ఇలా సాగిపోతుంటాయి నరేంద్ర మోడీ గురించి రాహుల్ గాంధీ చేసే విమర్శలు. కానీ రాహుల్ గాంధీ.. మిగతా ప్రతిపక్ష పార్టీల నాయకులు తెలుసుకోవాల్సింది ఒకటుంది. ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ విదేశాంగ విధానంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చారు. భారత్ అంటే చాలు తల ఎగిరిసే దేశాలను సైతం కాళ్ళ కిందికి తెచ్చుకున్నారు. అందువల్లే అది నచ్చని రాహుల్ గాంధీ.. ఇంకా మిగతా నాయకులు నరేంద్ర మోడీ మీద విమర్శలు చేస్తుంటారు.
తాజాగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రూబీయో ఇండియాకు వచ్చారు. ఇక్కడ రెండు రోజులపాటు ఉన్నారు. రకరకాల సమావేశాలలో పాల్గొన్నారు. కనీసం ఆయనకు ఇండియన్ గవర్నమెంట్ మామూలు వెల్కమ్ కూడా చెప్పలేదు. సిఐ స్థాయి పోలీసు అధికారులతో ఆయనకు వెల్కమ్ చెప్పించింది. ప్రధానమంత్రి వెళ్లలేదు. విదేశాంగ శాఖ మంత్రి కూడా వెళ్లలేదు. ఆ శాఖలో పనిచేసే అధికారులు కూడా వెళ్లలేదు. కేవలం అమెరికా దౌత్య విభాగంలో పనిచేసే వారు మాత్రమే వెళ్లారు. రూబియోకు స్వాగతం పలికారు.
భారతదేశం నుంచి వచ్చిన ఈ నిరసనను అమెరికా అంచనా వేయలేదు. రూబియో అయితే అలానే షాక్ లో ఉండిపోయాడు.. పైగా రూబియో కు ఇండియన్ ఫారిన్ మినిస్టర్ జై శంకర్ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.. వెనిజులా నుంచి మొదలు పెడితే రష్యా వరకు ప్రపంచంలో ఎక్కడ తక్కువ ధరలో చమురు లభిస్తే అక్కడ కొంటాం. ప్రతి దేశంతో బలమైన దౌత్య సంబంధాలను కొనసాగిస్తాం. మా మీద పెత్తనం సాగిస్తే అంత గట్టిగా బదులు చెబుతామని” జై శంకర్ చెప్పడంతో రూబియో కు చెమటలు పట్టాయి.
చివరికి మన దేశాన్ని వీడి అమెరికాకు వెళ్తున్న సమయంలో కూడా ఆయనకు ఘనమైన వీడ్కోలు లభించలేదు. వీడ్కోలు సమయంలో కూడా సిఐ స్థాయి అధికారితోనే భారత్ సెండాఫ్ ఇచ్చింది. కనీసం మన దేశంలో ఉన్నప్పుడు కూడా చెప్పుకునే స్థాయిలో గౌరవ మర్యాదలు ఇవ్వలేదు భారత్. ఇటీవల కాలంలో ట్రంప్ భారత్ మీద రకరకాల వ్యాఖ్యలు చేశాడు. అందువల్లే భారత్ ఇలా రివెంజ్ తీర్చుకుంది. ఇప్పట్లో ట్రంప్ ఇండియా జోలికి రాడు. ఇండియా గురించి మాట్లాడలేడు.. ఇటీవల చైనా టూర్ కు వెళ్ళినప్పుడు కూడా అమెరికా అధినేత ట్రంప్ కు ఈ స్థాయిలో పరాభవం ఎదురు కాలేదు. ఇప్పటికైనా ఇండియా గురించి ట్రంప్ తెలుసుకుంటే మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా చెత్త వాగుడు మానేస్తే మరింత మంచిది.
