Narendra Modi Political Dominance: భారత రాజకీయ ముఖచిత్రం చాలా దశాబ్దాల తర్వాత కొత్తగా కనిపిస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పారీ్ట అన్ని ఎన్నికల్లో గెలుస్తూ వచ్చింది. 1975 వరకు కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది. రాష్ట్రాలు, కేంద్రంలో వరుసగా ఎన్నికవుతూ వచ్చింది. నాడు దేశ ముఖచిత్రం మొత్తం మూడురంగుల జెండానే కనిపించేంది. 1980వ దశకం నుంచి ప్రాంతీయ పార్టీలు బలపడడం, రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ అధిపత్యానికి గండిపడింది. ఇదే సమయంలో భారతీయ జనతాపార్టీ కూడా పురడు పోసుకుంది. తొలి ఎన్నికల్లో కేవలం రెండు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ ప్రస్తుతం 12 ఏళ్లుగా అధికారంలో ఉంది. వరుసగా మూడుసార్లు కేంద్రంలో అధికారం చేపట్టింది. మోదీ మానియా బీజేపీని మూడోసారి అధికారంలోకి తెచ్చింది.
రాష్ట్రాల్లోనూ అధికారం..
ఇక మోదీ ప్రధాని అయ్యాక చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. నమో మంత్రం, డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లిన బీజేపీ సునాయాసంగా అధికారంలోకి వచ్చింది. 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని విస్తరిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో స్థిరమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ద్వారా, ప్రాంతీయ రాజకీయ సమతుల్యతను గణనీయంగా మార్చివేసింది.
వ్యూహాత్మక విస్తరణ..
మోదీ ప్రధాని అయ్యాక హరియాణాలో 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ అప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండగా మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలో బీజేపీ ఘనవిజం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడింది. 2016లో మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఆవిర్భవించింది. మహాయుతి కూటమి మద్దతుతో అధికార పగ్గాలు చేపట్టింది. దేవేంద్ర ఫడణవీస్ రాష్ట్ర తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు.
ఈశాన్య భారతంపై పట్టు..
ఈశాన్య భారతంలోని అస్సాం, అరుణాచల్ప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లోనూ కాషాయ జెండా రెపరెపలాడింది. అస్సాంలో సర్బానంద సోనోవాల్ సారథ్యంలో తొలి విజయాన్ని అందుకోగా, అరుణాచల్లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో పెమా ఖండూ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఇక 2017లో మణిపూర్లో జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలైన ఎన్పీపీ, ఎన్పీఎఫ్ మద్దతుతో మణిపుర్లో బీరెన్ సింగ్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 2018లో త్రిపుర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అక్కడి సుదీర్ఘ వామపక్ష పాలనకు బీజేపీ చరమగీతం పాడింది. బిప్లబ్ కుమార్ దేబ్ నేతృత్వంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.
పెద్ద రాష్ట్రాల్లో…
ఇక 2024లో ఒడిశా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో దశాబ్దాల బిజు జనతా దళ్ పాలనకు బీజేపీ తెరదించింది. మోహన్ చరణ్ మాఝీ ముఖ్యమంత్రిగా తూర్పు భారతదేశంలో పార్టీ ముందడుగు వేసింది. 2025లో బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్యంతో అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ.. ఇటీవలే నీతీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లడంతో సమ్రాట్ చౌదరీని ముఖ్యమంత్రిని చేసింది. తాజాగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ పాలనకు ముగింపు పలికింది. తొలిసారిగా బెంగాల్లో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. సువేంది అధికారి నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరింది.
గత పన్నెండేళ్ల కాలంలో బీజేపీ కేవలం ఎన్నికల విజయాన్నే కాకుండా, ప్రాంతీయ కూటములను సమన్వయం చేసుకుంటూ జాతీయ స్థాయి విస్తరణను సాధించింది. సంప్రదాయ రాజకీయ కంచుకోటలను బద్దలు కొట్టడంలో మరియు నాయకత్వ మార్పులను సుస్థిరంగా అమలు చేయడంలో పార్టీ అనుసరించిన వ్యూహాలు అద్వితీయం.