నిరూపిస్తే మీసం తీయించుకుంటా మంత్రి సవాల్..!

పోలవరం ప్రాజెక్టు 70 శాతం పూర్తి చేసినట్లు టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నిరూపిస్తే తాను మీసం తీయించుకుని తిరుగుతానని జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దేవినేని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. వెలిగొండ, గాలేరు-నగరి పూర్తి చేశామని చెప్పుకోవడాన్ని తప్పు బట్టారు. రాయలసీమకు తీరని నష్టం చేసింది టిడిపి అన్నారు. అందుకే ప్రజలు 10 సీట్లే ఇచ్చారని చెప్పారు. కృష్ణా […]

Written By: Neelambaram, Updated On : May 15, 2020 3:35 pm
Follow us on

పోలవరం ప్రాజెక్టు 70 శాతం పూర్తి చేసినట్లు టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నిరూపిస్తే తాను మీసం తీయించుకుని తిరుగుతానని జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దేవినేని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. వెలిగొండ, గాలేరు-నగరి పూర్తి చేశామని చెప్పుకోవడాన్ని తప్పు బట్టారు. రాయలసీమకు తీరని నష్టం చేసింది టిడిపి అన్నారు. అందుకే ప్రజలు 10 సీట్లే ఇచ్చారని చెప్పారు.

కృష్ణా జలాల్లో ఏపీకి రావాల్సిన వాటినే వాడకుంటున్నామని, అదే విధంగా సముద్రం పాలయ్యే మిగులు జలాలు మళ్లిస్తామన్నారు. దీంతో తెలంగాణా కు ఎటువంటి సమస్య ఉండదన్నారు. రాయలసీమ సాగు, తాగు నీటి సమస్య తీరుతుందని చెప్పారు. పొలిటికల్ స్టెంట్ లో భాగంగానే కొందరు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారని తెలిపారు. చరిత్ర సృష్టించాలంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. నీళ్లు అమ్ముకునే బుద్ధి వైసీపీ నాయకులది కాదని అది టీడీపీ వారికే చెల్లుతుందన్నారు.