ఏపీలో రెడ్ జోన్ ప్రాంతాలు ఇవే..!

రాష్ట్రంలో కరోనా కేసులు ఉధృతి కొంత మేర తగ్గినప్పటికీ రోజు కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,205 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 49 మంది ప్రాణాలు విడిచారు. అటు 1,353 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇది ఇలా ఉంటే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాల లిస్టును జిల్లాల వారీగా వెల్లడించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తన ట్విట్టర్ ఖాతా […]

Written By: Neelambaram, Updated On : May 18, 2020 10:25 am
Follow us on


రాష్ట్రంలో కరోనా కేసులు ఉధృతి కొంత మేర తగ్గినప్పటికీ రోజు కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,205 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 49 మంది ప్రాణాలు విడిచారు. అటు 1,353 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇది ఇలా ఉంటే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాల లిస్టును జిల్లాల వారీగా వెల్లడించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తన ట్విట్టర్ ఖాతా ఆరోగ్య ఆంధ్ర లో ట్వీట్ చేసింది. అత్యధిక రెడ్ జోన్ లు గల జిల్లాగా పశ్చిమ గోదావరి 15 మండలాలతో మొదటి స్థానంలో ఉండగా 14 మండలాలలో కర్నూలు నిలిచాయి. కేంద్రం లాక్ డౌన్ ను ఈ నెల 31 వరకూ పొడిగించడంతో, రాష్ట్రంలో ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రెడ్ జోన్ లలో లాక్ డౌన్ పూర్తి స్థాయిలో అమలు అవుతుంది. ఆరంజ్, గ్రీన్ జోన్ లలో మాత్రం లాక్ డౌన్ కు మరిన్ని సడలింపులు ఇవ్వనున్నారు. జిల్లాల వారీగా రెడ్ జోన్ వివరాలు ఇలా ఉన్నాయి.

కృష్ణా జిల్లా:

జగ్గయ్యపేట, విజయవాడ రూరల్, విజయవాడ అర్బన్, పెనమలూరు, మచిలీపట్నం, నూజీవిడు, ముసునూరు.

కర్నూలు జిల్లా:

ఆదోని, చిప్పగిరి, ఆస్పరి, తుగ్గలి, ఆత్మకూరు, కోడుమూరు, కర్నూలు టౌన్, నందికోట్కూరు, పాణ్యం, బనగానిపల్లె, నంద్యాల, గడివేముల, చాగలమర్రి, పాములపాడు.

కడప జిల్లా:

మైదుకూరు, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, కడప టౌన్, బద్వేల్, పులివెందుల, కమలాపురం.

నెల్లూరు జిల్లా:

నెల్లూరు టౌన్, నాయుడుపేట, వాకాడు, సూళ్ళురుపేట, తడ ప్రాంతాలు.

ప్రకాశం జిల్లా:

కారంచేడు, చీరాల, ఒంగోలు టౌన్, గుడ్లూరు ప్రాంతాలు.

అనంతపురం జిల్లా:

హిందూపూర్, కల్యాణదుర్గం, అనతపురం టౌన్

చిత్తూరు జిల్లా:

శ్రీకాళహస్తి, తిరుపతి అర్బన్, రేణిగుంట, పరదయపాలెం, సత్యవేడు, నాగలాపురం, నగిరి, పుత్తూర్, వెంకటగారికోట.

తూర్పుగోదావరి జిల్లా:

సామర్లకోట, పెద్దాపురం, కొత్తపేట, రాజమండ్రి అర్బన్, పిఠాపురం, శంఖవరం.

గుంటూరు జిల్లా:

మాచర్ల, దాచేపల్లి, అచ్చంపేట, నరసరావుపేట, గుంటూరు టౌన్, తాడేపల్లి, మంగళగిరి.

విశాఖపట్నం జిల్లా:

పెదగంట్యాడ, నర్సీపట్నం, కశింకోట, పెందుర్తి, విశాఖపట్నం అర్బన్, పద్మనాభం.

విజయనగరం జిల్లా:

బొందపల్లె, పూసపాటిరేగ, కొమరాడ, బలిజిపేట ప్రాంతాలు.

పశ్చిమ గోదావరి జిల్లా:

పోలవరం, గోపాలపురం, టి. నరసాపురం, కొవ్వూరు, చాగల్లు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉండ్రాజవరం, పెనుగొండ, భీమడోలు, ఏలూరు, ఆకివీడు, ఉండి, భీమవరం, నరసాపురం.