అధికార పార్టీ ఎమ్మెల్యేను వదలని కేసీఆర్

టీఆర్ఎస్ లో విచిత్ర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో ఇరకాటంలో పడిన పార్టీ తాజాగా ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సైతం భూకబ్జా కేసులో ఇరుక్కున్నారు. దీంతో పార్టీ అధినేత వైఖరి ఏమిటని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈటలను ఇరికించి చోద్యం చూసిన పార్టీ అధినేత ఇప్పుడు ఏం చేస్తారని చూస్తున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అడకత్తెరలో ఇరుక్కున్న పోకచెక్కలా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. మింగలేక కక్కలేక గులాబీ బాస్ […]

Written By: NARESH, Updated On : May 24, 2021 6:58 pm
Follow us on

టీఆర్ఎస్ లో విచిత్ర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో ఇరకాటంలో పడిన పార్టీ తాజాగా ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సైతం భూకబ్జా కేసులో ఇరుక్కున్నారు. దీంతో పార్టీ అధినేత వైఖరి ఏమిటని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈటలను ఇరికించి చోద్యం చూసిన పార్టీ అధినేత ఇప్పుడు ఏం చేస్తారని చూస్తున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అడకత్తెరలో ఇరుక్కున్న పోకచెక్కలా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. మింగలేక కక్కలేక గులాబీ బాస్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని పార్టీ వర్గాలు సైతం ఉత్కంఠగా ఉన్నాయి.

ఉప్పల్ శాసనసభ్యుడు సుభాష్ రెడ్డిపై భూకబ్జా కేసు నమోదైంది. కాప్రాలో సర్వే నెం. 152లో 90 ఎకరాల భూ వివాదంలో జోక్యం చేసుకుని ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేసినట్లు మేకల శ్ఱీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. పోలీసులను సంప్రదించినా ప్రయోజనం లేకపోవడంతో ఆయన ఆధారాలతో సహా కోర్టుకె క్కాడు. కోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.

అవినీతికి పాల్పడితే బిడ్డనైనా వదిలిపె ట్టనని కేసీఆర్ ఆరేళ్ల క్రితం గంభీరమైన స్వరంతో చెప్పారు. ఇప్పుడు ఆ డైలాగును తరచూ చాలా మంది గుర్తు చేసుకుంటారు. ఈటల రాజేందర్ ఇష్యూలో ఆయనపై అన్ని రకాల దర్యాప్తు సంస్థలు విరుచుకుపడుతున్నర సమయంలో బిడ్డల సంగతి సరే కానీ ఇతర నేతల అవినీతి, కబ్జా సంగతేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ నేతలపై తరుచుగా నమోదవుతున్న కేసులే ఇందుకు తార్కాణం.

కేసీఆర్ అసైన్డ్ భూముల అంశాన్ని ఉపయోగించి ఊటలను టార్గెట్ చేయడంతో ఆ భూముల విషయంలో ఇతర టీఆర్ఎస్ నేతలపై ఉన్న వాటిపైనా విచారణ చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. ఆ తరువాత మేడ్చల్ సీతారామచంద్ర స్వామి ఆలయ భూముల విషయంలోనూ అంతే అక్కడా టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఈటలనే టార్గెట్ చేసింది. ఇప్పుడు కోర్టులు ఆదేశిస్తున్నా ఎమ్మెల్యేలు, మంత్రులపై తూతూ మంత్రంగా కేసులే నమోదు అవుతున్నాయి.