ఎమ్మెల్యే ఆధిపత్యంతో కరోనా హాట్ బెడ్ గా కర్నూల్

కర్నూల్ జిల్లాలో కరోనా వైరస్ అదుపులోకి రాకపోవడం, ఒక విధంగా అధికార యంత్రాంగం చేతులు ఎత్తివేయడం, రాష్ట్ర ప్రభుత్వం సహితం నిస్సహాయంగా కనిపించడానికి అడ్డు అదుపు లేని స్థానిక ఎమ్యెల్యే ఆధిపత్యమే కారణమనే ఆరోపణలు చెలరేగుతున్నాయి. రాజకీయ వత్తిడుల కారణంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సహితం ఏమీ చేయలేక పోతున్నారని కధనాలు వెలువడుతున్నాయి. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 955కు చేరుకోగా, కర్నూల్ జిల్లాలోనే 261 ఉన్నాయి. కర్నూల్ నగరం అంతా రెడ్ […]

Written By: Neelambaram, Updated On : April 24, 2020 4:45 pm
Follow us on


కర్నూల్ జిల్లాలో కరోనా వైరస్ అదుపులోకి రాకపోవడం, ఒక విధంగా అధికార యంత్రాంగం చేతులు ఎత్తివేయడం, రాష్ట్ర ప్రభుత్వం సహితం నిస్సహాయంగా కనిపించడానికి అడ్డు అదుపు లేని స్థానిక ఎమ్యెల్యే ఆధిపత్యమే కారణమనే ఆరోపణలు చెలరేగుతున్నాయి. రాజకీయ వత్తిడుల కారణంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సహితం ఏమీ చేయలేక పోతున్నారని కధనాలు వెలువడుతున్నాయి.

ఏపీలో కరోనా కేసుల సంఖ్య 955కు చేరుకోగా, కర్నూల్ జిల్లాలోనే 261 ఉన్నాయి. కర్నూల్ నగరం అంతా రెడ్ జోన్ గా ప్రకటించారు. ఎమ్యెల్యే మద్దతు గల ఒక ప్రైవేట్ ఆసుపత్రి లాక్ డౌన్ సమయంలో కూడా యద్దేచ్ఛగా పనిచేయడంతో అది వైరస్ వ్యాప్తి కేంద్రంగా మారినట్లు స్పష్టం అవుతున్నది. చివరకు ఆ డాక్టర్ కూడా వైరస్ కు గురయ్యారు.

ప్రభుత్వ `నేరమయ నిర్లక్ష్యమే’ కుర్నూల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు కారణం అంటూ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తక్షణం ఉన్నతస్థాయి విచారణ జరపాలని లీగల్ రైట్స్ ఆబ్సెర్వేటరీ డిమాండ్ చేసింది.

అధికార యంత్రాంగంపై కర్నూల్ ఎమ్యెల్యే హఫీజ్ ఖాన్ రాజకీయ వత్తిడులే ప్రస్తుతం పరిస్థితులు అదుపు తప్పడానికి కారణం అంటూ ఈ సంస్థ మీడియా కథనాలను ఉటంకించింది.

ఢిల్లీలో తబ్లీఘి జమాత్ మర్కజ్ సదస్సుకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించి, వారికి కరోనా పరీక్షలు చేయనీయకుండా ఈ ఎమ్యెల్యే అడ్డుపడుతున్నట్లు ఆరోపణలు చెలరేగాయి. పైగా స్వీయ నిర్బంధ కేంద్రాలకు వెళ్లి, వారితో ఎమ్యెల్యే యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ కేసు ఛాతి నొప్పిగా చికిత్సఅంటూ ఆ వార్డ్ లో చికిత్స అందించితిన్ వ్యక్తికి సోదకడంతో చికిత్స అందించిన ఆ వార్డ్ లోని వైద్య సిబ్బంది అంతా భయకంపితులయ్యారు.

ఇలా ఉండగా, ఒక ప్రార్ధన స్థలంలో పెద్ద సంఖ్యలో అపరిచుతులు గుమికూడడంతో స్థానికులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే మరుసటి రోజుకంతా వారందరిని ఖాళీ చేయించి, అక్కడ అపరిచితులు గుర్మికుడినట్లు కధనాలు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేసి, వేధించారు. వాస్తవాలు చెప్పిన వారిపై జిల్లా యంత్రంగం కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నది.

ఆ ప్రైవేట్ హాస్పిటల్ ను ఏర్పాటు చేసిన డా. ఇస్మాయిల్ హుస్సేన్ ఏప్రిల్ 14న మృతి చెందాడు. మీడియా కధనాల ప్రకారం అతని కుటుంబానికిచెందిన ఆరుగురికు కూడా కరోనా పాజిటివ్ అని గుర్తించారు. వారందరిని స్వీయ నిర్బంధానికి పంపారు. ఏప్రిల్ 16న జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో ఆ ఆసుపత్రిని మార్చ్ 20 నుండి ఏప్రిల్ 16 వరకు సందర్శించిన వారందరిని వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోమని కోరింది.

ఈ ఆసుపత్రికి సందర్శించిన పొరుగున ఉన్న తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో కూడా చాలామంది కరోనా వైరస్ కు గురి కావడం గమనార్హం. ఒక ప్రైవేట్ ఆసుపత్రిని ఎందుకని లాక్ డౌన్ లో సహితం పనిచేయనిచ్చి, కరోనా వ్యాప్తికి దోహదపడ్డారో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ వత్తిడులే కారణం అని స్పష్టం అవుతుంది.