Homeజాతీయ వార్తలుKolar Gold Fields Will Reopen: KGF మళ్లీ ఓపెన్.. 80 ఏళ్ల తర్వాత ఇప్పుడు...

Kolar Gold Fields Will Reopen: KGF మళ్లీ ఓపెన్.. 80 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు తెరుస్తున్నారంటే?

Kolar Gold Fields Will Reopen: అయితే ఈ సినిమాలో కేజీఎఫ్ లో మరో కోణాన్ని ప్రశాంత్ నీల్ ఎంతో గొప్పగా చూపించడంతో ఆ సినిమా విజయవంతమైంది. సినిమా తర్వాత కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గురించి తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి మొదలైంది.. ఇప్పటికీ అక్కడి బంగారు గనుల గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. గూగుల్ లో వాటి గురించి సెర్చ్ చేసేవారు చాలామంది ఉన్నారని ఇటీవల ఓ నివేదికలో తేలింది.. అయితే కేజిఎఫ్ సినిమాలో చూపించినట్టుగా గతంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో బంగారాన్ని వెలికి తీసేవారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ అది మూతపడింది. దాదాపు 8 దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్ళీ కేజిఎఫ్ కు పూర్వపు రూపు దక్కనుంది.

కర్ణాటకలో ప్రస్తుతం హస్తం పార్టీ అధికారంలో ఉంది. వి నేపథ్యంలో చారిత్రాత్మకమైన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 80 సంవత్సరాల తర్వాత కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ పున: ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా భారత్ గోల్డ్ మైన్స్ సైట్ లోని 1003 ఎకరాల్లో బంగారం ఎక్కువగా ఉండే 13 టైలరింగ్ డంప్ లలో ఉపరితల మైనింగ్ చేపట్టడానికి కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే వీటి ద్వారా 23 టన్నుల బంగారం లభిస్తుందని తెలుస్తోంది. ఆత్యాధునిక మైనింగ్ టెక్నాలజీ ఉపయోగించి ప్రతి ఏడాది 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయడానికి అక్కడి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.. గతంలో ఇక్కడ డంపింగ్, మైనింగ్ విస్తృతంగా జరిగేది.అనూహ్య పరిణామాల నేపథ్యంలో డంపింగ్ ఆగిపోయింది. మైనింగ్ కూడా నిలిచిపోయింది. దాదాపు 8 దశాబ్దాలుగా అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరగడం లేదు. ఇన్నాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయం తీసుకోవడంతో కేజిఎఫ్ మళ్లీ పూర్వపు రూపు సంతరించుకోనుంది. వాస్తవానికి ఇక్కడ బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుందని.. మైనింగ్ మొదలయితే ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో మైనింగ్ భారీగా జరిగేదని.. మళ్లీ ఇప్పుడు ఆ తరహా వాతావరణం ఏర్పడుతుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: Woman Emotional Story: ఇష్టంగా పెంచుకుంటున్న కోడిని ఎవరో చంపేశారు.. తట్టుకోలేక ఈ మహిళ ఏం చేసిందంటే?

“ఇకపై ఇక్కడ మైనింగ్ మొదలవుతుంది. డంపింగ్ కూడా ప్రారంభమవుతుంది. కార్మికులకు చేతినిండా ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు ఇక సొంత ప్రాంతాలకు వస్తారు. అంతేకాదు ఇక్కడే ఉంటూ ఉపాధి పొందుతారు. దాదాపు 8 దశాబ్దాల తర్వాత ఇక్కడ పండుగ వాతావరణం మొదలైంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇక్కడ వేలాదిమందికి భృతి లభిస్తుంది.. ఈ ప్రాంతం మొత్తం వాహనాల రాకపోకలతో సందడిగా ఉంటుందని” స్థానికులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version