
యావత్ దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దెబ్బతో కెసిఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ లను ముసివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని..ముందస్తు చర్యలు చేపట్టింది.
ముందు జాగ్రత్తగా పాఠశాలలతో పాటు, సినిమా హాల్స్, మాల్స్ ను కూడా మూసివేయాలని సీఎం నిర్ణయించారు. మరో నాలుగు రోజుల్లో ఇంటర్ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలోనే పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలు కూడా షెడ్యూల్ ప్రకారం జరుగనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా రేపు, ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.