Homeజాతీయ వార్తలుJind woman: వరుసగా తొమ్మిది మంది కుమార్తెలు.. వారసుడి కోసం తపన.. చివరికి ఏమైంది అంటే?

Jind woman: వరుసగా తొమ్మిది మంది కుమార్తెలు.. వారసుడి కోసం తపన.. చివరికి ఏమైంది అంటే?

Jind woman: కంటే కూతుర్నే కనాలి.. మనసుంటే మగాడిలా పెంచాలి.. అప్పట్లో విడుదలైన ఓ సినిమాలో బహుళ ప్రాచుర్యం పొందిన పాట ఇది. కాకపోతే నేటికి కూడా చాలామంది ఆడపిల్లలను తమ వారసులుగా గుర్తించలేరు. ఇప్పటికీ మగాళ్లు మాత్రమే తమకు అసలుసిసలైన వారసులని భావిస్తుంటారు. ఆడపిల్లలు అన్ని రంగాలలో దూసుకుపోతున్నప్పటికీ.. మగాళ్ళకు మించి విజయాలు సాధిస్తున్నప్పటికీ.. మన సమాజం ఇప్పటికీ ఆడపిల్లలను వారసులుగా గుర్తించలేకపోతోంది.

చాలామంది తల్లిదండ్రులు (ఇందులో విద్యావంతులు కూడా ఉన్నారు) తమ వారసులుగా మగాళ్ళను మాత్రమే గుర్తిస్తున్నారు. అయితే తొలి, రెండో సంతానంలో ఆడపిల్లలు పుట్టినప్పటికీ.. వారసుల కోసం ఎదురుచూస్తున్నారు. చివరికి వారసుడిని కని తమ కలను నెరవేర్చుకుంటున్నారు. అయితే హర్యానా రాష్ట్రంలో ఓ దంపతులు తమ వారసుడి కోసం ఏకంగా 24 ఏళ్ల పాటు నిరీక్షించారు. దీనికోసం ఏకంగా తొమ్మిది మంది కుమార్తెలను కన్నారు. చివరికి తమకలను నెరవేర్చుకున్నారు.

ఇటీవల కాలంలో హర్యానా రాష్ట్రంలో ఓ దంపతులు తమ వారసుడి కోసం చాలామంది ఆడపిల్లలను కన్నారు. చివరికి తమ వారసుడికి జన్మనిచ్చి కలను నెరవేర్చుకున్నారు. ఇప్పుడు అదే రాష్ట్రంలో కూడా అటువంటి సంఘటనే చోటుచేసుకుంది. హర్యానా రాష్ట్రంలోని జింద్ జిల్లా ఉచన కలాన్ గ్రామానికి చెందిన సురేంద్ర, రీతు అనే దంపతులకు సరిగా 24 సంవత్సరాల క్రితం పెళ్లయింది. వీరికి 9 మంది కుమార్తెలు. ఇందులో పెద్ద కుమార్తె వయసు 21 సంవత్సరాలు. చిన్న కుమార్తె వయసు మూడు సంవత్సరాలు. తాజాగా రీతు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. దీంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సురేంద్ర సోదరుడికి కూడా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. దీంతో ఆ ఉమ్మడి కుటుంబంలో మొత్తం 12 మంది ఆడపిల్లలకు ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు. దాదాపు రెండు దశాబ్దాల ఎదురుచూపు తర్వాత కుమారుడు పుట్టడంతో సురేంద్ర దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి

ఈ తరహా సంఘటనే హర్యానా రాష్ట్రంలోని ఫతేహాబాద్ జిల్లా భోజరాజు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామంలో సంజయ్, సునీత అనే దంపతులకు 19 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి పదిమంది ఆడపిల్లలు పుట్టారు. 11వ సంతానంగా అబ్బాయి పుట్టాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version