ఘోర అవమానం: ఏపీ మంత్రి బుగ్గనను నెట్టేశారు

ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తిరుపతి విమానాశ్రయంలో ఆదివారం ఘోర అవమానం ఎదురైంది. ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రి పట్ల భద్రత సిబ్బంది దారుణంగా ప్రవర్తించారు. విమానాశ్రయంలోకి వెళుతున్న మంత్రిని నెట్టేశారు. దాదాపు కిందపడినంత పని మంత్రికి అయ్యింది. ఈ హఠాత్ పరిణామానికి మంత్రి బుగ్గన షాక్ అయ్యారు. ఢిల్లీ నుంచి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ రెండు రోజుల పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లాకు వచ్చారు. తిరుపతిలో ఆయన పర్యటిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం.. […]

Written By: NARESH, Updated On : June 14, 2021 1:01 pm
Follow us on

ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తిరుపతి విమానాశ్రయంలో ఆదివారం ఘోర అవమానం ఎదురైంది. ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రి పట్ల భద్రత సిబ్బంది దారుణంగా ప్రవర్తించారు. విమానాశ్రయంలోకి వెళుతున్న మంత్రిని నెట్టేశారు. దాదాపు కిందపడినంత పని మంత్రికి అయ్యింది. ఈ హఠాత్ పరిణామానికి మంత్రి బుగ్గన షాక్ అయ్యారు.

ఢిల్లీ నుంచి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ రెండు రోజుల పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లాకు వచ్చారు. తిరుపతిలో ఆయన పర్యటిస్తున్నారు.

ప్రోటోకాల్ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున స్వాగతం పలకడానికి రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చారు. తిరుగుప్రయాణంలో భాగంగా వీడ్కోలు పలకడానికి మంత్రి బుగ్గన వీఐపీ గేటు వద్దకు రాగా భద్రతా సిబ్బంది లోనికి అనుమతించలేదు. మంత్రి ప్రవేశించే ప్రయత్నం చేయగా బలంగా వెనక్కి నెట్టేయడంతో కిందపడిపోయే పరిస్థితి తలెత్తింది.

ఇక కేంద్రమంతి పీయూష్ కు స్వాగతం పలకకుండానే మంత్రి అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనను అడ్డుకున్న భద్రతా సిబ్బంది వివరాలు ఇవ్వాలని మంత్రి బుగ్గన విమనాశ్రయ అధికారులను ఆదేశించారు. దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు. ఇక విమానాశ్రయ అధికారులు మంత్రి బుగ్గనకు సర్ధి చెప్పినా ఆయన వెనక్కి తగ్గలేదు. దీంతో విమానాశ్రయంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.