Homeజాతీయ వార్తలుMLC Kavitha: అవినీతి కేసుల్లో నేతలకు ఫాయిదా అంతంతే.. గతంలో జరిగింది ఇదే

MLC Kavitha: అవినీతి కేసుల్లో నేతలకు ఫాయిదా అంతంతే.. గతంలో జరిగింది ఇదే

MLC Kavitha: మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది..మరో వైపు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు విచారణ లో వేగం పెంచారు. కీలక వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోజుకో కొత్త విషయాన్ని వెలుగులోకి తెస్తున్నారు. అయితే ఇలాంటప్పుడు సహజంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు నాపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తుతారు. ఇప్పుడు కవిత కూడా అదే పల్లవి అందుకున్నారు. మరి ఇందులో ఆమెకు దక్కుతున్న ఫాయిదా ఎంత?

అవినీతి కేసుల వల్ల రాజకీయ నేతలు నష్టపోయిన కేసుల్లో బోఫోర్స్‌ కేసు ఒకటి. 1987లో స్వీడన్‌ రేడియో బోఫోర్స్‌ ఉత్పత్తిదారు.. నాటి ప్రధాని రాజీవ్‌గాంధీకి ముడుపులు చెల్లించారన్న విషయం వెల్లడించిన తర్వాత ఆ సమయంలో స్వీడన్‌లోనే ఉన్న హిందూ పత్రిక విలేకరి చిత్రా సుబ్రహ్మణ్యం పరిశోధ న చేసి మరిన్ని వివరాలు కూపీలాగి పత్రికలో ప్రచురించారు. ఇది కాంగ్రెస్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో 1989ఎన్నికల్లో కాంగ్రెస్‌ చిత్తుగా ఓడిపోయింది. కాగా, బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై నమోదైన పశుగ్రాసం కేసుతో రాజకీయంగా ఆయన చాలా నష్టపోయారు. ఈ కేసుపై సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలైన తర్వాత 1996లో కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో జనతాదళ్‌లో తిరుగుబాటు చోటుచేసుకొని ఆయన ప్రత్యేక పార్టీ పెట్టాల్సివచ్చింది. ఎన్ని గిమ్మిక్కులు చేసినప్పటికీ 1998 తర్వా త ఆయన మళ్లీ సీఎం కాలేకపోయారు.

పాపం మాయావతి

యూపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి, నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2002లో తాజ్‌ కారిడార్‌, 2007-08లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆమెపై నమోదయ్యాయి. తర్వాత ఈ కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ వాటి ప్రభావం ఆమె భవిష్యత్తుపై పడింది. 2012 తర్వాత ఆమె మళ్లీ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఇక 2004-14 మధ్య పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంది. 2జీ, కామన్వెల్త్‌, బొగ్గు తదితర కుంభకోణాల వల్ల అప్రతిష్ఠపాలైంది. అనేక మంది నేతలు, అధికారులు జైలుకు వెళ్లివచ్చారు. చివరకు ఈ కేసుల్లో ఏమీ తేలకపోయినా.. 2014లో యూపీఏ మళ్లీ అధికారంలోకి రాలేకపోయింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper
Exit mobile version