జగన్ సర్కార్ పై ఫైర్ అయిన హరీష్ రావు!

పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి జగన్ సర్కార్ జారీ చేసిన 203 జీవో పై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 805 అడుగుల స్థాయి లో లిఫ్ట్ పెడుతున్నారంటే తెలంగాణపై ఎంతగా కుట్రలకు పాల్పడుతున్నారో అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కనీసం ఉన్నతస్థాయి కమిటీ అనుమతి కూడా లేకుండా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతోందని, ఏపీ ప్రభుత్వం చెబుతున్న దానికి, చేస్తున్నదానికి చాలా తేడా ఉంటోదని హరీష్ అన్నారు. ఏపీ […]

Written By: Neelambaram, Updated On : May 14, 2020 3:49 pm
Follow us on

పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి జగన్ సర్కార్ జారీ చేసిన 203 జీవో పై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 805 అడుగుల స్థాయి లో లిఫ్ట్ పెడుతున్నారంటే తెలంగాణపై ఎంతగా కుట్రలకు పాల్పడుతున్నారో అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కనీసం ఉన్నతస్థాయి కమిటీ అనుమతి కూడా లేకుండా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతోందని, ఏపీ ప్రభుత్వం చెబుతున్న దానికి, చేస్తున్నదానికి చాలా తేడా ఉంటోదని హరీష్ అన్నారు.

ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనపై గతంలోనే కృష్ణ బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు కూడా హరీష్ చెప్పారు.రాయలసీమ ఎత్తిపోతల పై మళ్లీ కేంద్రానికి, కృష్ణ బోర్డుకు ఫిర్యాదు చేస్తామని హరీష్ చెప్పారు.