Site icon OkTelugu

Cockroach founder: కాక్రోచ్ ఫౌండర్ కు దిమ్మతిరిగింది.. ఇది అసలు ఊహించలేదుగా..

Cockroach founder

Cockroach founder

Cockroach founder: దేశ రాజకీయాలను మారుస్తాం.. అవినీతి లేని పరిపాలన అందిస్తాం.. యువత నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు మెరుగైన పరిపాలన అందిస్తాం.. ఇలా సంచలన హామీలతో ఆన్లైన్లో ఏర్పాటు అయింది కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పార్టీ ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో చాలామంది ఫాలోవర్స్ ను పొందింది.. సంచలన ప్రకటనలతో ఇంకా ఇంకా సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడిగా అభిజిత్ కొనసాగుతున్నారు. ఈయన అమెరికాలో చదువుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిగా ఈయన సంచలన విషయాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నారు. దేశ రాజకీయాలను మారుస్తామని, ప్రజలు తమకు సహకరించాలని కోరుతున్నారు. ఎక్కడో అమెరికాలో ఉంటూ.. ఇటువంటి ప్రకటనలు చేస్తున్న అభిజిత్ మీద కొంతమంది విమర్శలు చేస్తుండగా.. మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అభిజిత్ ఇప్పుడు దేశ రాజకీయాలలో ఒక సంచలన వ్యక్తిగా మారిపోయారు. జనరేషన్ జెడ్ ఉద్యమాన్ని తీసుకురావాలని కోరుతున్న ఈయన.. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి పని చేశారు. ఇప్పుడు ఈయన బోస్టన్ లో చదువుకుంటున్నారు. అక్కడి నుంచే కాక్రోజ్ జనతా పార్టీ వ్యవహారాలను నడుపుతున్నారు.

సోషల్ మీడియాలో సంచలన సృష్టిస్తున్న అభిజిత్ కు ఇప్పుడు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది. ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. దాన్ని రికవరీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ మీద ఆయనకు యాక్సిస్ లేకుండా పోయింది. ఒకవేళ ఎవరైనా పోస్టులు చేస్తే.. వాటిని అధికారిక ప్రకటనలుగా భావించవద్దని అభిజిత్ వెల్లడించారు.

మనదేశంలో సోషల్ మీడియాలో రకరకాల వ్యక్తులు పుట్టుకొస్తుంటారు. కొంతమంది సెలబ్రెటీలు అవుతుంటారు. వారిని చాలామంది ఫాలో అవుతుంటారు. అలా అయినంత మాత్రాన వారేమీ దేశ పరిపాలకులు కాలేరు. మహా అయితే సెలబ్రిటీల హోదా అనుభవిస్తారు. డబ్బు కూడా సంపాదిస్తారు. అంతవరకే వారి స్థాయి ఆగిపోతుంది. అంతకుమించి ఊహించుకుంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు అభిజిత్ విషయంలో కూడా అదే జరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. సోషల్ మీడియాలో ఒక పార్టీ ఏర్పడినంత మాత్రాన అది దేశాన్ని పరిపాలిస్తుందని ఎలా అనుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అనవసరంగా హడావిడి తప్ప ఉపయోగం లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

Exit mobile version