తెరపైకి కుల రాజకీయాలు.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే హాట్‌ టాపిక్‌

కులాల ప్రాతిపదికన రాజకీయాలు ఇప్పటివరకు ఆంధ్రలోనే చూశాం. పాలన ఎలా ఉన్నా.. అభివృద్ధి ఎలా ఉన్నా.. కులం ప్రాతిపదికనే ఏపీలో రాజకీయాలు నడుస్తుంటాయి. ఎంతటా అంటే.. ఏకంగా కులం పేరుతో దూషించుకోవడం కూడా చేస్తుంటారు. ఒకరు చౌదరి అంటే.. మరొకరు నాయుడు అంటారు.. ఇంకొకరు రెడ్డి అంటారు. ఇప్పుడు అంతా ఆ కుల రాజకీయం రోడ్డున పడింది. ఇప్పుడు ఆ జాఢ్యం తెలంగాణకు సైతం పాకినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలోనూ కుల రాజకీయాలు మొదలయ్యాయి. అయితే.. అది ఇప్పటి […]

Written By: Srinivas, Updated On : March 8, 2021 10:55 am
Follow us on


కులాల ప్రాతిపదికన రాజకీయాలు ఇప్పటివరకు ఆంధ్రలోనే చూశాం. పాలన ఎలా ఉన్నా.. అభివృద్ధి ఎలా ఉన్నా.. కులం ప్రాతిపదికనే ఏపీలో రాజకీయాలు నడుస్తుంటాయి. ఎంతటా అంటే.. ఏకంగా కులం పేరుతో దూషించుకోవడం కూడా చేస్తుంటారు. ఒకరు చౌదరి అంటే.. మరొకరు నాయుడు అంటారు.. ఇంకొకరు రెడ్డి అంటారు. ఇప్పుడు అంతా ఆ కుల రాజకీయం రోడ్డున పడింది. ఇప్పుడు ఆ జాఢ్యం తెలంగాణకు సైతం పాకినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలోనూ కుల రాజకీయాలు మొదలయ్యాయి. అయితే.. అది ఇప్పటి వరకూ సామాజిక న్యాయం కోణంలోనే ఉండేవి. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో నేరుగా కులాల గురించి చర్చించుకుంటున్నారు.

Also Read: జగన్ అప్ డేటెడ్ పాలిటిక్స్.. బాబు పార్టీ ఖతమేనా?

హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి బీజేపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థిగా టీఆర్ఎస్ నుంచి పీవీ కుమార్తె సురభి వాణీదేవిని రంగంలోకి దింపారు. టీఆర్ఎస్ పోటీ చేయదని చివరి క్షణం వరకూ అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా వాణీదేవిని రంగంలోకి దింపడంతో బీజేపీకి షాక్ తగిలినట్లయింది. టీఆర్ఎస్ కుట్ర పూరితంగా బ్రాహ్మణ్ అభ్యర్థిపై బ్రాహ్మిణ్ అభ్యర్థిని రంగంలోకి దింపి.. ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తోందని బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావు టీఆర్ఎస్‌పై విరుచుకుపడ్డారు.

అయితే.. ఓ అభ్యర్థిగా ఉండి ఇలా కులాల ప్రకారం మాట్లాడటంతో సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. ఈ చర్చ కుల రాజకీయాలపై వ్యతిరేకతలా కాకుండా ఒకరినొకరు దూషించుకోవడానికన్నట్లుగా మారిపోయింది. మంత్రి కేటీఆర్ కూడా సురభి వాణీదేవికి మద్దతుగా జరిగే సభల్లో సందర్భం వచ్చినప్పుడల్లా.. తాము బ్రహ్మిణ్ సమాజానికి ఏం చేశామో చెప్పుకొస్తున్నారు. కేసీఆర్‌‌కు గురువులన్నా.. బ్రాహ్మణులన్నా ఎంతో ఇష్టమని చెబుతున్నారు. యాగాలు చేస్తుంటారన్నారు. ఇలా కులాల ప్రకారం విడిపోయి.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయడం తెలంగాణలో ఇదే మొదటి సారి.

Also Read: కాంగ్రెస్ పిచ్చి వ్యూహాలే కొంపముంచుతున్నాయా?

గతంలో కుల సమీకరణాలు.. అంతర్గతంగానే ఉండేవి. కానీ.. ఇప్పుడు ఏపీకి ఏమాత్రం తీసిపోకుండా బహిరంగం అయిపోయింది. అయితే.. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏమిటంటే.. ఇంకా కుల రాజకీయాలు ఆయా సామాజికవర్గాల్ని సంతృప్తి పరిచే దిశగానే ఉన్నాయి. ఒక్క సామాజికవర్గం మీద ఇతరుల్ని రెచ్చగొట్టే రాజకీయాల దాకా ఇంకా వెళ్లలేదు. ఆ అవలక్షణం కూడా చేరితో.. తెలంగాణ రాజకీయాలు కూడా.. ఏపీలాగా కుల రాజకీయాలకు కేరాఫ్‌లా మారిపోవడానికి ఎంతో కాలం పట్టదని చెప్పొచ్చు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్