Homeఆంధ్రప్రదేశ్‌స్థానిక రిజర్వేషన్లపై జగన్ కు భంగపాటు!

స్థానిక రిజర్వేషన్లపై జగన్ కు భంగపాటు!


రాష్ట్ర ప్రభుత్వం చేబడుతున్న పలు ఏకపక్ష నిర్ణయాల కారణంగా వరుసగా రాష్ట్ర హై కోర్ట్ లో ఎదురు దెబ్బలకే గురవుతున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరోసారి స్థానికులకు 75 శాతం రేజర్వేషన్లు కలిపిస్తూ తీసుకున్న చర్యపై కూడా భంగపాటు తప్పదా? అని అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ విషయమై దాఖలైన పిటిషన్ ను స్వీకరిస్తూ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలే అటువంటి అనుమానాలకు అవకాశం ఏర్పర్చుతున్నాయి. పరిశ్రమలు, ప్రభుత్వ – ప్రైవేట్- భాగస్వామ్య సంస్థలలో స్థైకులకు 75 శాతం రిజర్వేషన్ సదుపాయం జగన్ ప్రభుత్వం కల్పించడం తెలిసిందే.

విశాఖలో భారీ ప్రమాదం…!

ఈ నిర్ణయం ఏ మేరకు చట్టబద్దత కలిగి ఉందొ చెప్పాలని ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తూ, ఇది రాజ్యాంగ విరుద్ధమని అంటూ మౌఖికంగా హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేయడం ప్రభుత్వానికి ఆందోళన కలిగించే విషయమే. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి నెలరోజుల సమయం ఇచ్చింది.

ఆ విధంగా రేజర్వేషన్లు కల్పించడంలో యాజమాన్యాలు విఫలమైతే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటూ రాష్ట్రప్రభుత్వం గత ఆగస్టులో ‘ఏపీ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫ్‌ లోకల్‌ క్యాండిడేట్స్‌ ఇన్‌ ద ఇండస్ట్రీస్‌/ ఫ్యాక్టరీస్‌ యాక్ట్‌’ తీసుకొచ్చింది.

ఇందులోని 3, 8 సెక్షన్లను సవాల్‌ చేస్తూ విజయవాడకు చెందిన న్యాయవాది సీహెచ్‌ వరలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.

ఒక్కో ఇంటికి 2లీటర్ల మద్యం డెలివరీ!

కనీసం 12 ఏళ్ల స్థానికత ఉన్న వారికే ఉద్యోగాలంటూ ముల్కీ నిబంధనల పేరుతో 1969లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొనడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని స్పష్టం చేశారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం భారత రాజ్యాంగంలోని అధికరణ 16(2), (3)లకు విరుద్ధంగా ఉందని.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని వివరించారు.

ప్రభుత్వ న్యాయవాది సి.సుమన్‌ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై ఏమైనా అభ్యంతరాలుంటే పరిశ్రమల యాజమాన్యాలు కోర్టుకు రావచ్చని, పరిశ్రమలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి ఇలాంటి పిటిషన్‌ దాఖలు చేయడానికి వీల్లేదని తెలిపారు. అందువల్ల ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు.

ఇందుకు పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది బదులిస్తూ చట్టాన్ని ఎవరైనా సవాల్‌ చేయవచ్చని, వ్యక్తిగతంగా బాధితులైన వారే సవాల్‌ చేయాలన్న నిబంధన ఎక్కడా లేదని పేర్కొన్నారు. ఆయన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. పై ఆదేశాలిచ్చింది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Oktelugu Epaper
Exit mobile version