BRS Win In Maharashtra: ఎట్టకేలకు మహారాష్ట్రలో కేసీఆర్ బోణి.. సాధించేశాడు పో..

BRS Win In Maharashtra: భోకర్ మార్కెట్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేసి బొక్కా బోర్లా పడిన భారత రాష్ట్ర సమితికి ఇక మహారాష్ట్రలో అంత సీన్ లేదు అనుకుంటున్న తరుణంలో శుభవార్త దక్కింది.. మహారాష్ట్రలో ఒక గ్రామ పంచాయతీకి జరిగిన ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి చెందిన అభ్యర్థి సర్పంచ్ గా తొలి విజయాన్ని అందించాడు. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ఉప ఎన్నికల్లో తన ప్రత్యర్థి పై 115 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. ” ఇది తొలి విజయం మాత్రమే కాదు. రాబోయే ఎన్నికల కోసం ఉత్సాహంగా పనిచేసేందుకు దోహదపడుతుందని” భారత రాష్ట్ర సమితి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

అంబేలోహల్ గ్రామపంచాయతీ ఉప ఎన్నికల్లో..

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ లో గంగాపూర్ తాలూకా అంబేలోహల్ గ్రామపంచాయతీ ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గఫార్ సర్దార్ పఠాన్ 115 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి పై విజయం సాధించారు. ఇక ప్రస్తుతం మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాలకు చెందిన భారత రాష్ట్ర సమితి కార్యకర్తలకు నాందేడ్ లో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుండగానే సర్పంచ్ గా గెలవడం పట్ల భారత రాష్ట్ర సమితి హర్షం వ్యక్తం చేస్తున్నది. ఇది ఒక శుభ పరిణామం అని, త్వరలో మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికల్లో అన్నిచోట్ల ఇదే ఫలితం కనిపిస్తుందని భారత రాష్ట్ర సమితి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎన్నికలకు మరికొంత సమయం ఉండడంతో

దేశవ్యాప్తంగా గులాబీ జెండా ఎగరవేయాలని భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత ముందుగా ఆంధ్రప్రదేశ్లో పార్టీని విస్తరించాలి అనుకున్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగానే విశాఖ ఉక్కు కర్మగారం ఆసక్తి వ్యక్తి కరణ నోటిఫికేషన్ జారీ అయింది. అయితే దానిని సింగరేణి స్వీకరిస్తుందని ప్రకటన చేసిన కేసీఆర్.. తర్వాత ఎందుకనో వెనుకడుగు వేశారు. ఈ పరిణామంతో ఆంధ్రప్రదేశ్లో అంత ఈజీగా అడుగుపెట్టడం సాధ్యం కాదని భావించిన ఆయన.. తర్వాత తన దృష్టిని మహారాష్ట్ర వైపు మళ్ళించారు. అక్కడ ఇప్పటికే మూడు చోట్ల సభలు నిర్వహించారు. భోకర్ మార్కెట్ కమిటీ ఎన్నికల్లో బోర్లా పడ్డారు. అయితే తొలి అడుగుకే అపజయం ఎదురు కావడంతో.. ఈసారి మరింత బలంగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే శరత్ మార్ఖడ్ అనే వ్యక్తిని తన ప్రైవేట్ సెక్రటరీగా నియమించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి జీతం చెల్లిస్తూ, కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా కెసిఆర్ వెనుకడుగు వేయలేదు. ఇక నాందేడ్ లో పార్టీ కార్యాలయం ప్రారంభించిన తర్వాత, శిక్షణ తరగతులు మొదలుపెట్టారు. ఉప ఎన్నికల్లో సర్పంచ్ స్థానాన్ని గెలుచుకున్న భారత రాష్ట్ర సమితి.. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నది.

Get notified whenever we post something new!

Continue reading

Pakistan: పాకిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టిన ఆఫ్గాన్‌… అంగీకరించిన రక్షణ మంత్రి!

Pakistan: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. పాకిస్తాన్‌లోని 9 ఉగ్రస్తావారాలతోపాటు 11 ఎయిర్‌ బేస్‌లను ధ్వంసం చేసింది. డీజీఎంవో స్థాయి చర్చల తర్వాత సీజ్‌ఫైర్‌ కుదిరింది. అయితే ఆపరేషన్‌ సిందూర్‌లో తామే విజయం సాధించినట్లు పాకిస్తాన్‌ సంబురాలు చేసుకుంది. ర్యాలీలు నిర్వహించింది. పాక్‌ సైనికాధికారి ఆసిమ్‌ మునీర్‌కు ఫీల్డ్‌ మార్షన్‌గా...

Per capita income India: తెలంగాణ మొదటి స్థానం నుంచి నాలుగు కి పడిపోయింది

Per capita income India: భారతదేశంలో ఇప్పుడు తలసరి ఆదాయం ఎంత ఉందో కేంద్ర ప్రభుత్వం లెక్కలు వెల్లడించింది. అలాగే, గత పదేళ్లలో మన దేశంలో ప్రజల సగటు ఆదాయం ఎంత పెరిగిందో కూడా తెలిపింది. అయితే, ఈ పెరుగుదల అన్ని రాష్ట్రాల్లో ఒకేలా లేదు. కొన్ని రాష్ట్రాలు బాగా ముందున్నాయి.. మరికొన్ని వెనుకబడ్డాయి....

Microsoft carbon credit purchase: ఇక లెట్రిన్ గుంటలకు కాపాలా పెట్టాలేమో..మలమూత్రాలు టన్నుకు రూ.30వేలిచ్చి కొంటున్న మైక్రోసాఫ్ట్

Microsoft carbon credit purchase: ఇక నుంచి మన ఇంట్లోని, పబ్లిక్ టాయిలెట్ల లెట్రూం గుంటల వద్ద కూడా సెక్యూరిటీ పెట్టాల్సి వస్తుందేమో. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మనుషుల వ్యర్థాలను.. అంటే మలం, మూత్రాన్ని డబ్బు పెట్టి కొంటోంది. ఒక టన్ను వ్యర్థాలకు ఏకంగా రూ.30,000 (350 డాలర్లు) ఇస్తోందట. వోల్టెడ్ డీప్ అనే...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version