Andaman Islands: అండమాన్.. బ్రిటిష్ కాలంలో ఇక్కడ అత్యంత కఠినమైన కారగారాలను నిర్మించారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వారిని ఇందులో వేసి చంపేశారు. నేటి ఆధునిక కాలంలో అండమాన్ పేరు గుర్తుకు వస్తే మనకు వెంటనే సముద్రం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక్కడ దీవులు.. వివిధ రకాల తెగలు.. అవన్నీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అండమాన్ ప్రాంతం ప్రకృతి సంపదకు పెట్టింది పేరు. ఇక్కడ విశాలమైన సముద్ర తీరం పర్యాటకులను ఆకట్టుకుంటుంది.
అండమాన్ కేవలం సముద్ర తీర ప్రాంతంగా.. దీవుల సముదాయంగానే ఉండదు.. ఇకపై ఈ ప్రాంతం దేశం మొత్తానికి సరిపడా కరెంట్ ను ఉత్పత్తి చేయబోతోంది. అలాగని ఇక్కడ విస్తారమైన బొగ్గు గనులు లేవు. జీవ నదులు అంతకంటే లేవు. ఇలాంటి చోట విద్యుత్ ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుంది.. పైగా ఇది అత్యంత సున్నితమైన ప్రాంతం. అలాంటప్పుడు విద్యుత్ ఎలా తయారు చేస్తారు.. అనే ప్రశ్నలు మీలో వ్యక్తమవుతున్నాయి కదా.. దీనికి సమాధానమే ఈ కథనం.
ప్రస్తుత కాలంలో విద్యుత్ అవసరాలు పెరిగిపోతున్నాయి. థర్మల్ పవర్ మీద ఎక్కువగా ఆధారపడితే పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోంది. ప్రాజెక్టులలో నీరు ఉన్నప్పుడు మాత్రమే జల విద్యుత్ తయారీ సాధ్యమవుతుంది. గాలి బాగా వీచినప్పుడు మాత్రమే హైడల్ పవర్ ఉత్పత్తి చేయవచ్చు. ఇక సోలార్ పవర్ అయితే.. వర్షాకాలంలో తగినంత స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదు. పైగా దీనికి భూమి చాలా కావాలి.
ప్రకృతికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా.. విద్యుత్ అవసరాలు తీర్చుకునే మార్గం మీద మన దేశం దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే అండమాన్ ప్రాంతంలో పైలెట్ ప్రాజెక్టు ఏర్పాటు చేయబోతోంది. అండమాన్ అనేది హిందూ మహాసముద్రంలో ఒక భాగం. ఇక్కడ కేంద్రం హాట్ స్పాట్లను గుర్తించింది. ఎనర్జీ కన్వర్టర్లు.. హైబ్రిడ్ కన్వర్టర్లు ఏర్పాటు చేస్తారు. సముద్రం మీద ఒక వేదిక నిర్మించి.. వాటిపై వీటిని ఏర్పాటు చేస్తారు. ఇంటిగ్రేటెడ్ హైబ్రిడ్ పవర్ జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఇది మరికొన్ని సంవత్సరాలలో ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుంది.
ఎలా విద్యుత్ ఉత్పత్తి చేస్తారంటే
సముద్రంలో కావలసినంత శక్తి ఉంటుంది. ఈ శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అలలు.. ఆటుపోట్లు.. ప్రబాహాల ద్వారా సహజ కదలికలు ఏర్పడతాయి. దీనివల్ల సముద్రంలో ఉన్న నీటి ఉష్ణోగ్రత ల వ్యత్యాసాన్ని కరెంట్ మాదిరిగా మార్చవచ్చు. సముద్ర జలాల్లో ప్రతి ఏడాది 9.2 లక్షల టెరా వాట్ (ఒక్క టెరా వాట్ పది లక్షల మెగా వాట్లకు సమానం) గంటల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు.
సముద్రంలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని సద్వినియోగం చేసుకోవడానికి బ్లూ ఎనర్జీ మార్గాలు ఉపయోగపడతాయి. అనేక దేశాలు సముద్రంలో ఆటుపోట్లు.. ప్రవాహాలు.. కెరటాలు.. అలలు వంటి వాటితో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే భారత్ ఇందుకు భిన్నంగా ఆలోచిస్తోంది. కేవలం విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాకుండా.. సముద్ర జలల మీద సోలార్ ప్లేట్లను ఏర్పాటు చేస్తోంది. తద్వారా నదులు, సముద్ర జలాల మధ్య ఉన్న సాలినిటీ తేడాల ద్వారా కూడా కరెంటు తయారు చేసే మార్గాలను రూపొందిస్తుంది. భారత రూపొందించిన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో సంవత్సరానికి టెరా వాట్ అవర్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఇక మనదేశం ప్రతి ఏడాది 1600 టెరా వాట్ ల విద్యుత్ ను ఉపయోగించుకుంటున్నది. ఈ ప్రకారం చూసుకుంటే దాదాపు 575 సంవత్సరాలపాటు కోతలు లేకుండా దేశం మొత్తానికి ఇక్కడి నుంచి విద్యుత్ అందించే అవకాశం ఉంటుంది. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ఓషన్ ఎనర్జీ అట్లాస్ రూపొందించింది..
సముద్ర జలాల నుంచి విద్యుత్తు తయారు చేయడం మంచి పని అయినప్పటికీ.. దీనికోసం చేసే ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుంది . ఒక మెగావాట్ టైడల్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి దాదాపు 60 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలి. ఒకవేళ సోలార్ పవర్ కు మూడు నుంచి నాలుగు కోట్లు.. పవన విద్యుత్ కు నాలుగు నుంచి ఐదు కోట్లు సరిపోతాయి. వచ్చే రోజుల్లో టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి సముద్ర జలాల నుంచి విద్యుత్ ఉత్పత్తికి చేసే ఖర్చు తగ్గుతుందని తెలుస్తోంది . భవిష్యత్తు కాలంలో కేవలం సముద్రాలు మాత్రమే మనుషుల కరెంటు అవసరాలు తీర్చుతాయని నిపుణులు అంటున్నారు.
