spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Vangaveeti Ranga: రంగాను చంపింది టీడీవీవాళ్లే.. ఆంధ్రజ్యోతి మళ్లీ బుక్కైంది

Vangaveeti Ranga: రంగాను చంపింది టీడీవీవాళ్లే.. ఆంధ్రజ్యోతి మళ్లీ బుక్కైంది

Vangaveeti Ranga: అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా నిజం చేయవచ్చు కానీ.. నిజాన్ని మాత్రం మరుగున పడేయ్యలేం. ఏపీలో ఓ సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్నది అదే. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. పొలిటికల్ పార్టీలకు సొంత మీడియా తోడైన తరువాత ఈ తరహా చర్యలు ప్రారంభమయ్యాయి. ఏపీలో ఎల్లో మీడియా, నీలి మీడియా, కూలి మీడియా ఇలా విభిజనకు గురయ్యాయి. ప్రజలు కూడా ఓ మీడియా వార్తలను చూసి నిర్థారణకు రాలేకపోతున్నారు. తటస్థ మీడియాను చూసి వార్తలు, కథనాల్లో నిజానిజాలను తెలుసుకుంటున్నారు.

ఎల్లోమీడియాగా చెప్పుకునే ఈనాడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహా టీవీల కథనాలు, డిబేట్లు ఒకలా ఉంటాయి. వీరు చెప్పిందే వాస్తవం. చూపిందే వార్త అన్నట్టు సాగుతోంది వీరి వ్యవహారం. ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అయితే బరితెగించి వ్యవహరిస్తూ ఉంటుంది. ఎప్పుడూ టీడీపీ, చంద్రబాబు పల్లకి మోయడం దీని పని. ఈ క్రమంలో కొన్నిసార్లు తన చర్యలతో అబాసుపాలవుతుంటుంది. నెటిజన్లకు అడ్డంగా బుక్కవుతుంటుంది. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా హత్యకు సంబంధించి డిబేట్ లో వెంకట కృష్ణ ఓవారక్షన్ చేసి అడ్డంగా బుక్కాయ్యారు.

1988లో వంగవీటి దారుణ హత్యకు గురయ్యారు. అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. వర్గ పోరులో భాగంగా రంగాను హత్య చేశారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రభుత్వంలో చంద్రబాబుది యాక్టివ్ రోల్. నాటి టీడీపీ సీనియర్ ఉపేంద్ర, చంద్రబాబు ఈ ఘటన వెనుక ఉన్నారన్న ఆరోపణలున్నాయి. కానీ ఎక్కడా రుజువు కాలేదు. కాలక్రమంలో రంగా హత్య మరుగునపడిపోయింది. కానీ రంగా క్రేజ్ ను మాత్రం సొంతం చేసుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తునే ఉన్నాయి. తన తండ్రి మరణం వెనుక టీడీపీ ఉందని ఆరోపణలు చేసిన రంగా కుమారుడు రాధా ఇప్పుడు అదే పార్టీలో చేరాల్సిన అనివార్య పరిస్థితి. దీంతో తరచూ రంగా హత్యను రాజకీయ నాయకులు ప్రస్తావిస్తూ ఉంటారు.

టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకుంటాయని వార్తలు వస్తున్న తరుణంలో కాపు ఓటు బ్యాంకుపై అధికార వైసీపీ ఫోకస్ పెంచింది. ముద్రగడను పార్టీలో చేర్చుకోవడంతో పాటు రంగా హత్యను తెరపైకి తెస్తోంది. రంగాను హత్యచేయించిన చంద్రబాబుతో ఎలా అంటగాకుతున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. వెంకట కృష్ణ సంయమనం కోల్పోతూ వంగవీటి మోహన్ రంగాను టీడీపీ వాళ్లు హత్యచేస్తే మీకు మంట ఏమిటని అనేశారు. దీంతో ఇది పెను దుమారంగా మారింది. సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ఆడేసుకుంటున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చర్యలను తప్పుపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Andhra Pradesh Investments

Andhra Pradesh Investments: ఏపీకి భారీ పెట్టుబడులు!

Andhra Pradesh Investments: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రకు వరుసగా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు వచ్చాయి....
Modi Instagram Reel

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....
AP MLC Elections

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...
Roja

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....
Ravi Teja

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...
Oktelugu Epaper