Homeఆంధ్రప్రదేశ్‌అమరావతిలో వందల ఎకరాల భూములు కొన్నపేదలపై సిఐడి కేసులు

అమరావతిలో వందల ఎకరాల భూములు కొన్నపేదలపై సిఐడి కేసులు

ప్రభుత్వ విడుదల చేసే నిత్యావరస వస్తువుల కొనుగోలు, లోన్ సబ్సిడీ పొందడానికి పేదలకు ఇచ్చే కార్డు ఈ తెల్ల రేషన్‌ కార్డు అని అందరికి తెలుసు.. అయితే అమరావతిలో భూములు కొనుగోలు వ్యవహారంపై సిఐడి కేసు నమోదు చేసింది.

Read More:తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఎన్టీఆర్ బాటలో జగన్

ల్యాండ్‌ పూలింగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేప్టటింది. తెల్ల రేషన్‌ కార్డు కలిగిన 796 మందిపై కేసు నమోదు చేసింది. ఎకరానికి 3 కోట్ల రూపాయిల చొప్పున 300 కోట్ల రూపాయిలతో భూములు కొనుగోలు చేసినట్లు సిఐడి గుర్తించింది. తెల్లకార్డులు కలిగిన వారితో భూములు కొనుగోలు చేయించిన వారిపై ఆరా తీస్తోంది. విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. మొత్తం 129 ఎకరాలు కొనుగోలు చేసిన 131 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్లు. పెద్ద కాకానిలో 43 మంది తెల్లకార్డు హోల్డర్లు 40 ఎకరాలు కొన్నారు. తాడికొండలో 188 మంది 180 ఎకరాలు, తుళ్లూరులో 238 మంది 243 ఎకరాలు, మంగళగిరిలో 148 మంది 133 ఎకరాలు, తాడేపల్లిలో 49 మంది 24 ఎకరాలు కొన్నారని సిఐడి గుర్తించింది.

Read More: అమరావతి భూ కుంభకోణంపై నిజాన్ని నిగ్గు తేల్చాలి

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version