వర్షాకాలంలో చేపలు తింటే ఆ సమస్యలు.. వైద్యులేం చెప్పారంటే?

దేశంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడాల్లేకుండా చాలా ప్రాంతాల్లో వర్షాకాలం కొనసాగుతోంది. సాధారణంగా ఇతర మాసాలతో పోలిస్తే శ్రావణ మాసంలో ప్రజలు మాంసాహారం తినడానికి ఆసక్తి చూపరు. శ్రావణ మాసంలో ప్రజలు చేపలు, మాంసం తినరనే సంగతి తెలిసిందే. అయితే వర్షాకాలంలో చేపలు తినకుండా ఉండటమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో చేపలు తినకుండా ఉండటానికి ముఖ్యమైన కారణాలు చాలా ఉన్నాయి. వర్షాకాలం జలచరాల్లో సంతానోత్పత్తి కాలం కావడంతో ఈ సమయంలో చేపలు […]

Written By: Kusuma Aggunna, Updated On : August 18, 2021 6:02 pm
Follow us on

దేశంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడాల్లేకుండా చాలా ప్రాంతాల్లో వర్షాకాలం కొనసాగుతోంది. సాధారణంగా ఇతర మాసాలతో పోలిస్తే శ్రావణ మాసంలో ప్రజలు మాంసాహారం తినడానికి ఆసక్తి చూపరు. శ్రావణ మాసంలో ప్రజలు చేపలు, మాంసం తినరనే సంగతి తెలిసిందే. అయితే వర్షాకాలంలో చేపలు తినకుండా ఉండటమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో చేపలు తినకుండా ఉండటానికి ముఖ్యమైన కారణాలు చాలా ఉన్నాయి.

వర్షాకాలం జలచరాల్లో సంతానోత్పత్తి కాలం కావడంతో ఈ సమయంలో చేపలు లక్షల సంఖ్యలో గుడ్లు పెడతాయి. వర్షాకాలంలో చేపలు తింటే చేపల తర్వాత తరం లేకుండా పోయే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో సంతానోత్పత్తి వల్ల చేపలలో అనేక వ్యాధులు విజృంభించే అవకాశాలు ఉంటాయి. వీటిని తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో కాలుష్య వ్యర్థాలు నదులలో కలిసిపోతాయి.

కాలుష్య వ్యర్థాలు నదులలో కలవడం వల్ల చేపలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉండటంతో జబ్బుపడిన చేపలు తింటే మీరు కూడా జబ్బు పడే అవకాశాలు ఉంటాయి. వర్షాకాలంలో చేపలను తాజాగా ఉంచడానికి అనేక రసాల రసాయనాలను వినియోగించడం జరుగుతుంది. వర్షాకాలంలో ఆహారంగా తినుబండారాలు, శీతల పానీయాలు, ఐస్‌క్రీములను తీసుకోకూడదు.

ఉడికించిన కూరలలో నిమ్మరసం కలుపుకుని తాగితే మంచిది. ఉప్పును తక్కువగా వాడటంతో పాటు ఆవు నెయ్యి, నువ్వుల నూనె, స్నిగ్ధ పదార్థాలు తింటే మంచిది. వర్షాకాలంలో తాజా ఫలాలు ఎక్కువగా తీసుకోవడంతో పాటు వాటిలో శొంఠి, మిరియాల పొడి స్వల్పంగా తీసుకుంటే మంచిది.