Diabetes: ఈ మధ్య కాలంలో ఎక్కువమందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో మధుమేహం ఒకటి. మధుమేహం చికిత్స, నిర్ధారణలో గ్లూకోజ్ మోతాదులు కీలకంగా ఉంటాయి. మధుమేహం ఉన్నా చాలామందికి ఆలస్యంగా షుగర్ ఉందని తెలుస్తుంది. ఆహారం, వ్యాయామ నియమాలను పాటించడం ద్వారా షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవడం సాధ్యమవుతుంది. ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించి పొగ తాగడం మానేయడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
షుగర్ చాలాకాలం క్రితమే శరీరంలో మొదలై ఉంటే మాత్రం శరీరంపై వేర్వేరు విధాలుగా దుష్ప్రభావాలు చూపే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మందులు ఆలస్యంగా వాడితే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం అయితే ఉంది. మధుమేహం వచ్చి పదేళ్లు దాటిన వాళ్లను నాడీ సంబంధిత సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి. మందులు వాడకుండా షుగర్ ను అదుపులో ఉంచుకోవడం మాత్రం తేలిక కాదు.
మధుమేహం వచ్చిన వాళ్లలో కాళ్లలో లేదా వేళ్లలో బలహీనత ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇన్సులిన్ ఇంజెక్షన్లను వాడటం ద్వారా రక్తంలో గ్లూకోజ్ మోతాదులను అదుపులో ఉంచుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. అరికాళ్లలో మంటలు, తిమ్మిర్లకు వేర్వేరు మందులు అందుబాటులో ఉన్నాయి. మధుమేహం వచ్చిన వాళ్లకు పుండ్లు అయితే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవడం సాధ్యమవుతుంది. 60 నుంచి 70 శాతం మందిలో మందులు వాడకుండా షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవడం సాధ్యం కాదు. కొన్నిసార్లు కాలుష్యాల వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది.