Fast eating health effects: తినే తిండి మీదనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఆహారంలో ఆకుకూరల నుంచి మొదలు పెడితే ప్రోటీన్స్ వరకు అన్నీ ఉండేలా చూసుకుంటారు. మరికొందరేమో ఆ సమయానికి ఒక ముద్ద తినేస్తే సరిపోతుంది అనుకుంటారు.. ఇంకొందరేమో తినే తిండిని అత్యంత వేగంగా ముగించేస్తారు.
ఆహారాన్ని సాధ్యమైనంతవరకు నమిలి మింగాలి. ఎక్కువసేపు తినాలి. అలాకాకుండా ఆబరాగా తినేస్తే ఇబ్బంది కలుగుతుంది. వేగంగా తినడం వల్ల ఆకలి తీరదు. పైగా ఆహారం మరింత ఎక్కువ తినాలనిపిస్తుంది. వేగంగా తినే క్రమంలో మనం ఎంత ఆహారం తీసుకుంటున్నామో అర్థం కాదు. దానివల్ల జీర్ణ వ్యవస్థ మీద ఒత్తిడి ఏర్పడుతుంది. ఆహారం విపరీతంగా తిన్నప్పుడు శరీరం ఒకరకంగా మారిపోతుంది. బద్ధకం ఆవరిస్తుంది. అడుగులు వేయాలంటేనే ఇబ్బంది ఉంటుంది. దీంతో చాలామంది విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో ఆహారం తాలూకు కేలరీలు శరీరంలో నిల్వ ఉంటాయి. అవి ఖర్చు కాకుండా ఉండిపోవడంతో కొవ్వులుగా మారిపోతాయి. ఆ కొవ్వులు శరీరానికి హాని కలిగిస్తాయి.
ఇలాంటి హానికరమైన కొవ్వుల వల్ల టైప్ 2 డయాబెటిక్ సమస్య వస్తుంది. ఇది రాకుండా ఉండాలి అంటే ఆహారాన్ని నమిలి మింగాలి. సాధ్యమైనంతవరకు వేగంగా ఆహారాన్ని తినడం కాకుండా.. నిదానంగా నమిలి మింగాలి. ఆహారంలో కార్బోహైడ్రేట్స్ నుంచి మొదలు పెడితే ప్రోటీన్ల వరకు అన్నీ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా మాంసాహారాన్ని తగ్గించాలి. కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలను.. గింజలను తీసుకోవడం వల్ల శరీరానికి సమాన విధానంలో పోషకాలు అందుతాయి. ఆహారాన్ని నమిలి మింగడం వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగ్గా ఉంటుంది. శరీరంలో కేలరీలు పేరుకు పోవడానికి ఆస్కారం ఉండదు. ఆహారం తిన్న తర్వాత కాసేపు నడిస్తే అది త్వరగా జీర్ణం అవుతుంది. అప్పుడు కేలరీలు ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందువల్ల కొవ్వు నిల్వలు ఏర్పడవు.
వెనుకటి కాలంలో మన పెద్దలు ఆహారం తినగానే నడిచేవారు. ఏదైనా పనిలో నిమగ్నం అయ్యేవారు. ముఖ్యంగా మాంసాహారం తినడంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అందువల్లే ఆహారాన్ని మితంగా తినాలి. నమిలి తినాలి. వేగానికంటే నిదానానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది.
గమనిక ..
ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్యుల చికిత్సకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు. వివిధ వేదికల వద్ద సేకరించిన సమాచారాన్ని ఓకే తెలుగు తన పాఠకుల కోసం ఈ కథనాన్ని అందించింది. ఎట్టి పరిస్థితిలోనూ ఈ కథనం వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు అనే విషయాన్ని పాఠకులు గుర్తించాలి.