Soundarya – Venkatesh: వెంకటేష్ కి సౌందర్య రాఖీ ఎందుకు కట్టాల్సి వచ్చింది..?

అయితే వీళ్ళ కాంబో లో పెళ్లి చేసుకుందాం, రాజా,ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం,దేవి పుత్రుడు లాంటి సినిమాలు వచ్చాయి. ఒకానొక టైంలో వెంకటేష్, సౌందర్య మంచి రిలేషన్ షిప్ లో ఉన్నారనే విషయం ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వినిపించింది.

Written By: Gopi, Updated On : September 24, 2023 3:14 pm

Soundarya - Venkatesh

Follow us on

Soundarya – Venkatesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో వెంకటేష్ కూడా ఒకరు ఈయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా ఈయన సౌందర్య తో చేసిన సినిమాలు మంచి విజయాలు అందుకోవడమే కాకుండా వీళ్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి.

అయితే వీళ్ళ కాంబో లో పెళ్లి చేసుకుందాం, రాజా,ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం,దేవి పుత్రుడు లాంటి సినిమాలు వచ్చాయి. ఒకానొక టైంలో వెంకటేష్, సౌందర్య మంచి రిలేషన్ షిప్ లో ఉన్నారనే విషయం ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వినిపించింది. ఇక వెంకటేష్ తన వైఫ్ కి విడాకులు ఇచ్చి సౌందర్యాని పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారంట, దాంతో ఈ విషయం తెలిసిన రామానాయుడు వెంకటేష్ తో వద్దు అని ఎంత చెప్పినా వెంకటేష్ సరిగ్గా పట్టించుకునే వాడు కాదంట…

ఇక దాంతో లాభం లేదని సౌందర్య దగ్గరికి వెళ్లి రామానాయుడు ఆమెతో వాడికి ఒక ఫ్యామిలీ ఉంది వాటిని డిస్టర్బ్ చేయకు అని చెప్పడంతో సౌందర్య రామానాయుడు గారి మాట మీద గౌరవం ఉంచి వెంకటేష్ ని దూరం పెట్టడం మొదలుపెట్టింది. దాంతో సౌందర్య కి దూరంగా ఉంటూ వెంకటేష్ వచ్చాడు.వీళ్ళ మధ్య కొంచెం గ్యాప్ పెరిగింది. ఇక దేవి పుత్రుడు సినిమా తర్వాత వీళ్ళకాంబో లో మళ్లీ ఇంకో సినిమా రాలేదు అయితే ఇండస్ట్రీలో వీళ్ళ మధ్య ఏదో సంబధం ఉంది అని అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది.

అయితే వీరి మధ్య ఏమీ సంబధం లేదు అని చెప్పడానికే రామానాయుడు సౌందర్య గారితో వెంకటేష్ కి రాఖీ కట్టించారు. ఈ విషయం అప్పట్లో చాలా పాపులర్ అయింది.ఇక అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు అనేది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిపోయింది. ఇక తర్వాత కొద్ది సంవత్సరాలకే సౌందర్య వేరే అతన్ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది. అనుకోకుండా జరిగిన ఫ్లైట్ ప్రమాదంలో ఆవిడ చనిపోవడం జరిగింది…