Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: మహేష్ బాబు కోరి మరీ పిలిపించుకున్న ఈ ‘పిల్ల’ ఎవరబ్బా?

Mahesh Babu: మహేష్ బాబు కోరి మరీ పిలిపించుకున్న ఈ ‘పిల్ల’ ఎవరబ్బా?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో టాలీవుడ్ మోస్ట్ ప్రామిసింగ్ హీరో ‘అడవి శేష్’ హీరోగా రాబోతున్న సినిమా మేజర్. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో హీరో అడివి శేష్ విడుదల చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సినిమా టికెట్స్ కోసం మహేష్ బాబు, హీరో అడివి శేష్ క్యూలో నిలబడతారు. అడివి శేష్, మహేష్ బాబు, యూట్యూబర్ నిహారిక మధ్య జరిగిన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.

Mahesh Babu
Mahesh Babu, Adivi Sesh

ముఖ్యంగా మహేష్ బాబు కోరి మరీ పిలిపించుకున్న ఈ ‘పిల్ల’ ఎవరబ్బా? అంటూ యూట్యూబర్ నిహారిక గురించి నెటిజన్స్ లో చర్చ మొదలు అయ్యింది. యూట్యూబర్ నిహారిక తన వీడియోలతో బాగా ఫేమస్ అయ్యారు. ఆమె వీడియోలను మహేష్ కూడా రెగ్యులర్ గా ఫాలో అవుతాడట. అందుకే, ఆమె చేత మేజర్ సినిమాకు ప్రమోషనల్ వీడియోస్ చేయిస్తున్నాడు. ఇక మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కి మేజర్ జూన్3న రిలీజ్ కానుంది.

Mahesh Babu
Niharika

ఇప్పటికే మేజర్ సినిమాకి సెన్సార్ అయ్యింది. యూ/ఏ సర్టిఫికెట్‌ తో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఇక సినిమా గురించి సెన్సార్ రిపోర్ట్ విషయానికి సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుందని.. సినిమాలో మంచి ఫీల్ ఉందని.. అలాగే దేశభక్తికి సంబంధించి కూడా ఈ చిత్రం గొప్ప చిత్రంగా నిలిచిపోతుందని తెలుస్తోంది. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.

Also Read: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ యూ టర్న్.. టీడీపీ మంచి పార్టీ అని కితాబు

ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏది ఏమైనా ‘అడివి శేష్’ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. అమెరికా నుంచి వచ్చిన పేద కళాకారుడిగా ఎన్నో ఇబ్బందులు పడి నేడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు.

జీరో నుంచి మైనస్ లోకి వెళ్లి, ప్రస్తుతం పది కోట్లు మార్కెట్ ను క్రియేట్ చేసుకుని వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు ఈ హీరో. తనకు మాత్రమే సాధ్యం అన్నట్టు వైవిధ్యమైన చిత్రాలతో పేరు తెచ్చుకున్న అడివి శేష్ కి, లేడీస్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

కాగా, ఈ మేజర్ సినిమాను జి.ఎమ్‌.బి ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మిస్తోంది. శ్రీ చరణ్ పాకల ఈ మూవీకి సంగీత దర్శకుడు. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషలలో విడుదలవబోతుంది.

Also Read: Amalapuram Incident: మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు తగులబెట్టినా ఎందుకు చర్యల్లేవ్.? ఏంటి కథ?

Recommended Videos:

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular