Site icon OkTelugu

Vijay Deverakonda Rashmika meets PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో విజయ్ దేవరకొండ,రష్మిక భేటీ..ఫోటోలు వైరల్ !

Vijay Deverakonda Rashmika meets PM Modi

Vijay Deverakonda Rashmika meets PM Modi

Vijay Deverakonda Rashmika meets PM Modi: నిన్న రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలస్ లో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika mandanna) జంట ఎంతో గ్రాండ్ గా కుటుంబ సభ్యుల సమక్షం లో పెళ్లి చేసుకోగా, అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసిన ఇప్పుడు ఈ జంటకు సంబంధించిన పెళ్లి ఫొటోలే కనిపిస్తున్నాయి. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా అనిపించే ఈ జంట అంటే అభిమానులకు మాత్రమే కాదు, మూవీ లవర్స్ కి కూడా ఎంతో ఇష్టం. ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అయితే రష్మిక పోస్ట్ కి 18 మిల్లియన్లకు పైగా లైక్స్ రాగా , విజయ్ దేవరకొండ పోస్ట్ కి , విజయ్ దేవరకొండ పోస్ట్ కి 15 మిల్లియన్లకు పైగా లైక్స్ వచ్చాయి . ఈ రేంజ్ లో లైక్స్ ఇప్పటి వరకు హిస్టరీ లో ఏ సెలబ్రిటీలకు కూడా రాలేదని అంటున్నారు విశ్లేషకులు .

ఇదంతా పక్కన పెడితే ఈ జంటకు సంబంధించిన వెడ్డింగ్ రిసెప్షన్ మార్చి 4 న హైదరాబాద్ , బంజారా హిల్స్ లోని తాజ్ బంజారా లో గ్రాండ్ గా జరగనుంది. సాయంత్రం 7 గంటల నుండి జరగబోతున్న ఈ రిసెప్షన్ వేడుకకు సినీ సెలబ్రిటీలంతా హాజరు కాబోతున్నారని, వీళ్ళతో పాటు రాజకీయ నాయకులు కూడా వస్తారని మన అందరికీ తెలిసిందే. ఈ నూతన దంపతులు జంటగా కలిసి వెళ్లి అందరినీ ఆహ్వానించారట . నేడు ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) ని ఈ జంట కలిసి తమ వెడ్డింగ్ రిసెప్షన్ కి రావాల్సిందిగా కోరారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మరో ఎంతో బిజీ గా ఉండే ప్రధాని మోడీ, హైదరాబాద్ లో జరిగే ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి వస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Also Read: ‘నీ అయ్య వడ్డీ…నీ బిడ్డ కడితే…నువ్వేమి పొడిచావనే’..పెద్ది 2వ పాట వచ్చేస్తోంది !

ఒకవేళ వస్తే మాత్రం వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. అంత ప్రేమగా పిలిచారు కాబట్టి సాధారణమైనంత వరకు ప్రధాని వచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు అంటున్నారు. అదే విధంగా విజయ్ దేవరకొండ పెళ్ళికి ముందు తెలంగాణ రాజకీయ నాయకులను కూడా కలిసి తమ రిసెప్షన్ కి రావాల్సిందిగా కోరారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. కానీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ వంటి వారిని ఆహ్వానించారో లేదో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న వీళ్ళ లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

Exit mobile version