
టాలీవుడ్ హీరోలపై కొందరు హీరోయిన్లు చిన్నచూపు చూస్తున్నారు. ఇతర భాష హీరోయిన్లకు టాలీవుడ్ దర్శక నిర్మాతలు పెద్దపీఠ వేస్తుంటే వాళ్లు మాత్రం టాలీవుడ్ హీరోల క్రేజీని తక్కువచేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు. టాలీవుడ్లో ఆఫర్లు కోసం ఒకప్పుడు వెంపర్లాడిన హీరోయిన్లు వారికి కొంతపేరు రాగానే అన్ని మరిచిపోతున్నారు. టాలీవుడ్ హీరోలను తక్కువ చేసి ఇతర భాషల హీరోలు తోపులన్న రీతిలో కొందరు హీరోయిన్ల వ్యాఖ్యలు చేస్తుండటంపై టాలీవుడ్ ప్రేక్షకులు ఫైరవుతోన్నారు.
ఇటీవల త్రిషకు సోషల్ మీడియాలో లైవ్లో అభిమానుల నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. మీకు నచ్చిన ముగ్గురు హీరోల గురించి చెప్పండి? అని ప్రశ్నించగా ఆమె కోలీవుడ్ నుంచి కమలాహాసన్, మల్లువుడ్ నుంచి మోహన్ లాల్, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ పేర్లను చెప్పింది. టాలీవుడ్ నుంచి ఒక్క హీరో పేరు కూడా వెల్లడించలేదు. చెన్నైకి చెందిన ఈ అమ్మడికి టాలీవుడ్ ఇండస్ట్రీ వల్లే సినిమాల్లో గుర్తింపు వచ్చింది. కెరీర్ తొలినాళ్లలో ఆమె ఇతర భాషల్లో చేసిన సినిమాలేవీ ఆమెకు గుర్తింపు తీసుకురాలేదు. టాలీవుడ్లో ప్రభాస్ నటించిన ‘వర్షం’ మూవీతోనే త్రిష విజయాల బాట పట్టింది. టాలీవుడ్లోని అగ్రనటులందరికీ సరసన నటించిన త్రిష వీళ్లను కాదని తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వని అమీర్ ఖాన్ పేరు చెప్పడంపై నెటిజన్లు మండిపడుతోన్నారు. ఆమె టాలీవుడ్ హీరోలను మరిచిపోవడం చూస్తుంటే కావాలనే త్రిష ఇలా చేసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి.ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ నుంచి క్రియేటీవ్ డిఫెరెన్స్ పేరుతో ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా ముఖంగా ప్రకటించి త్రిష అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఈ అమ్మడికి టాలీవుడ్లో అవకాశాల్లేకపోవడంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంటుందని పలువురు విమర్శిస్తున్నారు.
తాజాగా టాలీవుడ్లో బీజీగా స్టార్ గా మారిన పూజా హెగ్డే సైతం టాలీవుడ్ హీరోలను తక్కువ చేసే ప్రయత్నం చేసింది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫ్యాన్స్ గుస్సా అవుతోన్నారు. లాక్డౌన్ సమయంలో మీరు ఏ హీరోతో స్వీయనిర్భంధంలో ఉండాలని అనుకుంటున్నారని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు హృతిక్ రోషన్ అంటూ సమాధానం ఇచ్చింది. టాలీవుడ్లో మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి హీరోలతో నటించి పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ హీరో పేరును వెల్లడించడంపై ఫ్యాన్స్ గుస్సా అవుతున్నాయి. అయితే ఈ అమ్మడు తెలివిగా అవకాశం వస్తే అందరితో స్వీయనిర్భంధంలో ఉంటానని చెప్పింది. హృతిక్ రోషన్ అంటే తనకు చిన్నప్పటి నుంచి క్రష్ ఉందని చెప్పింది. ఈ విషయంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతోంది. హీరోయిన్లు వారికి నచ్చిన హీరోల పేర్లు వెల్లడిస్తే తప్పేంటీ? అని ప్రశ్నిస్తుండగా మరికొందరు మాత్రం వాళ్లను తప్పుబడుతున్నారు. ఇప్పటికే సీనియర్ హీరోయిన్ త్రిష టాలీవుడ్ ప్రేక్షకులు ఆగ్రహానికి గురవుతోండగా తాజాగా పూజా హెగ్డే చేరింది. ఇప్పటికైనా టాలీవుడ్ దర్శక, నిర్మాతలు, హీరోలు పరభాష హీరోయిన్లకు ప్రాధాన్యాన్ని తగ్గించి తెలుగు భామలకు అవకాశాలిచ్చే వారిని ఎంకరేజ్ చేయాలని టాలీవుడ్ ఫ్యాన్స్ కోరుతున్నారు. మున్మందు ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే..!