Vijay Sethupathi: ఇటీవలే ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతిపై బెంగళూరు విమానాశ్రయంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం పెద్ద దుమారమే రేపింది. గత నెలలో జాతీయ అవార్డు అందుకుని తిరిగి వస్తోన్న విజయపై ఒకరు దాడి చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. అందుకు సంబంధించిన వీడియో కూడా ఒకటి నెట్టింట్లో వైరల్గా మారింది. కాగా, అతనెవరో ఆని ఆరాదీయగా.. అతని పేరు మహా గాంధీ అని తెలిసింది. అయితే, ట్విస్ట్ ఏంటంటే విజయ్ పరివారమే తనపై దాడి చేసిందంటూ మహా గాంధీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చెన్నై సైదా పేట మెట్లో పాలిటన్ కోర్టు విజయ్తో పాటు అతని మేనేజర్ జాన్సన్లకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 2న దీనిపై విచారణ జరగనుంది.

Also Read: ఎట్టకేలకు నెరవేరనున్న పునీత్ సంకల్పం.. మ్యూజియంగా తండ్రి నివసించిన పూరిల్లు
మహాగాంధీ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు.. చెన్నై విమానాశ్రయంలో విజయ్ని చూడటానికి తను వెళ్లినప్పుడు.. అతని బృందంలోని ఓ వ్యక్తి తనతో అభ్యంతరంగా వ్యవహరించాడని మహాగాంధీ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విజయ్ పరివారానికి, తనకు మధ్య వాగ్వాదం జరిగిందని.. ఆ తర్వాత విమానాశ్రయం వెలుపల తనపై విజయ్ మేనేజర్ జాన్సన్ దాడిపి పాల్పడినట్లు తెలిపారు.
కాగా, ఈ దాడి జరిగిన కొద్ది రోజులకు మక్కల్ కట్చి నాయకుడు అర్జున్ సంపత్ విజయ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ను తన్నిన వారికి రూ.1001 బహుమతిగా చెల్లిస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ విషయంపై అర్జున్పై కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
Also Read: త్వరలో నటిగా పరిచయం కానున్న మిస్ యూనివర్స్.. ఇప్పటికే రెండు సినిమాలకు సైన్