spot_img
Homeఎంటర్టైన్మెంట్Pushpa 2: షాకింగ్: పుష్ప2లో అల్లు అర్జున్ ‘తగ్గేదే లే’ ఉండదట?

Pushpa 2: షాకింగ్: పుష్ప2లో అల్లు అర్జున్ ‘తగ్గేదే లే’ ఉండదట?

Pushpa 2:సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. అందులో తగ్గేదేలే అని డైలాగ్ అందరిని అదరగొట్టింది. అందరికి మేనరిజంగా మారింది. దీంతో అందరి నోట తగ్గేదేలే అనే మాట కామన్ అయిపోయింది. కొన్ని కొన్ని మాటలు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతాయి. గతంలో చిరంజీవి ప్రతి సినిమాకు ఇలాంటి డైలాగులతో ప్రేక్షకులను అలరించేవారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అదే బాటలో నడుస్తున్నాడు. రేసుగుర్రం చిత్రంలో ‘ద్యావుడా’ అనే డైలాగు కూడా ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ఇప్పటికి కూడా పలువురు ద్యావుడా అనే డైలాగును మరిచిపోవడం లేదు. అదే కోవలో తగ్గేదేలే అనే డైలాగు కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దీంతో అల్లు అర్జున్ మేనరిజానికి అందరు ఫిదా అవుతున్నారు.

Pushpa 2
allu arjun

దర్శకుడు సుకుమార్ పుష్ప2 పనిలో నిమగ్నమయ్యారట. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో పడ్డాడు. ఆగస్టు నుంచి పుష్ప-2 షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో ‘తగ్గేదేలే’ అనే డైలాగు సృష్టించిన సునామీ అందరికి తెలిసిందే. కానీ పుష్ప-2లో మాత్రం ఈ డైలాగును ఉంచడం లేదట. మరో డైలాగ్ తీసుకోవాలని సుకుమార్ చూస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read: Singer Chinmayi Sripada: సింగర్ చిన్మయి ఇంస్టాగ్రామ్ డిఎమ్ లో మగాళ్ల ప్రైవేట్ పార్ట్స్ ఫోటోలు… అకౌంట్ సస్పెండ్

పుష్ప-2ను కూడా అదే స్థాయిలో బ్లాక్ బస్టర్ గా చూపించాలని సుకుమార్ తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కథలో బలమైన క్యారెక్టర్లు తీసుకుని సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాలని దర్శకుడు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తగ్గేదేలే అనే డైలాగుకు బదులుగా చిత్తూరు యాసలో మరో డైలాగును పెట్టాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ మదిలో ఏముందో అనే విషయం ఎవరికి తెలియడం లేదు.

allu arjun
allu arjun

మొత్తానికి పుష్ప-2లో కథాపరంగా వచ్చే మార్పులు చోటుచేసుకుంటాయని తెలుస్తోంది. దీనికి గాను దర్శకుడు కథ ఎలా మలుపు తిప్పుతారో అన్న ఆసక్తి నెలకొంది.. మొదటి పార్టులో ఉన్న తగ్గేదేలే డైలాగును మాత్రం రెండో పార్టులో ఉంచకుండా వేరే డైలాగును తీసుకోవాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పుష్ప-2 కూడా ప్రేక్షకుల అంచనాలు అందుకుని బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందా? లేక ఇదివరకే వచ్చిన సినిమాల్లా అవుతుందా అనేదే తేలాల్సి ఉంది. సుకుమార్ శక్తి మీద నమ్మకంతోనే పుష్ప-2 కూడా ముందుకు సాగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read:Shruti Haasan Tattoo: అక్కడ గులాబీ టాటూ వేయించుకున్న శృతి… అయితే క్యాబేజీ అయ్యిందంటూ క్రేజీ కామెంట్
Recommended Videos
పవిత్ర లోకేష్ మొదటి భర్త ఎవరో తెలుసా || Actress Pavitra Lokesh First Husband ||  Suchendra Prasad
Sonu Sood Latest Gym Work Out Visuals || Sonu Sood Latest Video || Oktelugu Entertainment
గీతాంజలి సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో  చూడండి || See How Geetanjali Movie Heroine is Now

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...

Andhra Pradesh Investments: ఏపీకి భారీ పెట్టుబడులు!

Andhra Pradesh Investments: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రకు వరుసగా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు వచ్చాయి....

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....
Oktelugu Epaper
Exit mobile version