Jabardasth: జబర్దస్త్ లోకి కొత్త యాంకర్ గా సిరి హన్మంత్? ఎవరినీ తీసేస్తున్నారంటే?

జడ్జ్ లు మారిన తర్వాత చివరికి కృష్ణ భగవాన్, ఇంద్రజలు ఫిక్స్ అయ్యారు. జబర్దస్త్ షోకు సౌమ్య, ఎక్స్ ట్రాకు రష్మీ యాంకర్లుగా ఫిక్స్ అయ్యారు. అంతా బాగుందనుకున్న సమయంలోనే మళ్లీ తేడా కొట్టేసింది.

Written By: Suresh, Updated On : November 7, 2023 10:42 am

Jabardasth

Follow us on

Jabardasth: జబర్దస్త్ షో ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఈ షో టాప్ రేటింగ్స్ తో దూసుకొని పోయింది. సుధీర్, గెటప్ శ్రీను, ఆది, అనసూయ, నాగబాబు, రోజా ఇలా అందరూ జబర్దస్త్ షోను ఓ రేంజ్ లో నిలబెట్టారు. ఆ తర్వాత ఇందులో ఎన్నో చీలికలు, వివాదాలు వచ్చాయి. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అని రెండుగా చీల్చారు. కొన్ని రోజుల పాటు రష్మీ, అనసూయలు ఆ రెండు షోలను నడిపించారు. ఆ తర్వాత అనసూయ పక్కకి తప్పుకుంది. జడ్జ్ లు కూడా వెళ్లిపోయారు. ఇలా జడ్జ్ లు మారుతూనే వచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడు యాంకర్లు కూడా మారుతూనే ఉన్నారు.

జడ్జ్ లు మారిన తర్వాత చివరికి కృష్ణ భగవాన్, ఇంద్రజలు ఫిక్స్ అయ్యారు. జబర్దస్త్ షోకు సౌమ్య, ఎక్స్ ట్రాకు రష్మీ యాంకర్లుగా ఫిక్స్ అయ్యారు. అంతా బాగుందనుకున్న సమయంలోనే మళ్లీ తేడా కొట్టేసింది. ఇక కన్నడ భామ సౌమ్య తెలుగు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎన్ని రకాలుగా కూనీ చేయగలరో అన్ని రకాలుగా కూనీ చేసినట్టుగా మాట్లాడుతుంది. ఇదిలా ఉంటే రష్మీ ఇప్పుడు బాగానే మెరుగైంది. తనకు మల్లెమాలలో తిరుగులేదు అనే రేంజ్ కు ఎదిగింది. అలా శ్రీదేవి డ్రామా కంపెనీని కూడా నడిపిస్తోంది.

జబర్దస్త్ షోకు కొత్త యాంకర్ వచ్చిన విషయం ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సిరి మెరిసింది. ఈమె శాశ్వత యాంకరా? లేదా ఓ రెండు మూడు ఎపిసోడ్ ల కోసం వచ్చిందా? అనే ప్రశ్నకు జవాబు లేదు. సౌమ్య రావుకు ఏదైనా సమస్య వస్తే ఈ అమ్మడును తీసుకొని వచ్చారు కావచ్చు అని టాక్. లేదంటే సౌమ్యను తప్పించి సిరిని పెట్టుకున్నారా అనేది కూడా క్లారిటీ లేదు. ఇక నూకరాజు మాత్రం వచ్చీ రాగానే సిరి పరువు తీశాడు. సిరిహన్మంతు నువ్వు ఉండేది వన్ వంతు అన్నాడు. అయితే అది ప్రాస కోసమా? నిజంగానే వన్ మంతా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.