Tollywood : హీరోలు బిజీ.. బ్లాక్ బస్టర్ దర్శకులు ఖాళీనే.?

టాలీవుడ్ లో హీరోలు తక్కువయ్యారు.. దర్శకులు ఎక్కువయ్యారు. బోలెడు కథలు పట్టుకొని హీరోలకు చెబుతున్నారు. వారు ఓకే కూడా అంటున్నారు. కానీ ఎవరూ సినిమాలు పట్టాలెక్కించడం లేదు.. కారణమేంటి? హీరోలు ఖాళీగా లేరు. చిన్న హీరో నుంచి పెద్ద హీరో దాకా అందరి చేతిలో ఇప్పుడు రెండు మూడు సినిమాలున్నాయి. అందుకే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకులు కూడా హీరోలు ఖాళీలేక నెలల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితులు టాలీవుడ్ లో ఉన్నాయి. ‘ఉప్పెన’ మూవీతో టాలీవుడ్ […]

Written By: NARESH, Updated On : September 1, 2021 1:11 pm
Follow us on

టాలీవుడ్ లో హీరోలు తక్కువయ్యారు.. దర్శకులు ఎక్కువయ్యారు. బోలెడు కథలు పట్టుకొని హీరోలకు చెబుతున్నారు. వారు ఓకే కూడా అంటున్నారు. కానీ ఎవరూ సినిమాలు పట్టాలెక్కించడం లేదు.. కారణమేంటి? హీరోలు ఖాళీగా లేరు. చిన్న హీరో నుంచి పెద్ద హీరో దాకా అందరి చేతిలో ఇప్పుడు రెండు మూడు సినిమాలున్నాయి. అందుకే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకులు కూడా హీరోలు ఖాళీలేక నెలల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితులు టాలీవుడ్ లో ఉన్నాయి.

‘ఉప్పెన’ మూవీతో టాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు(Buchibabu). ఎవ్వరూ ఊహించని కథను ఎంచుకొని అంతే చక్కగా తెరపై చూపించి సంచలన విజయాన్ని అందించాడు. ఆ తర్వాత ఎన్టీఆర్, వైష్ణవ్ తేజ్ లతో సినిమాలు తీసేందుకు కథలు కూడా వినిపించాడు. కానీ ఇంతటి హిట్ ఇచ్చిన దర్శకుడు కూడా ఇప్పుడు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులున్నాయి.

మెగా హీరో వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) తో రూ.50 కోట్ల హిట్ సినిమా ఇచ్చిన బుచ్చిబాబుతో సినిమాకు అగ్రహీరోలు ఆసక్తి చూపించారు. ఎన్టీఆర్ కోసం స్పోర్ట్స్ బ్రాక్ డ్రాప్ లో ఓ కథ కూడా చెప్పాడు. ఎన్టీఆర్ కూడా ఓకే అన్నాడు. కానీ అతడి చేతిలో ఉన్న సినిమాల వల్ల బుచ్చిబాబు సినిమా పట్టాలెక్కలేదు.

ఈలోగా తన మొదటి సినిమా హీరో వైష్ణవ్ తేజ్తో మరో సినిమా చేయాలని బుచ్చిబాబు ఫిక్స్ అయ్యాడు. మైత్రీ మూవీస్ లోనే వైష్ణవ్ తో సినిమా ఖాయం అనుకున్నాడు. కానీ వైష్ణవ్ కూడా వరుస సినిమాలతో బిజీ అయ్యాడు.

ప్రస్తుతం వైష్ణవ్ .. క్రిష్ దర్శకత్వంలో ‘కొండపొలం’ చేస్తున్నాడు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ సినిమా ఒప్పుకున్నాడు. ఇలా రెండు సినిమాల వరకు వైష్ణవ్ ఖాళీగా లేడు. దీంతో బుచ్చిబాబుకు హీరో దొరక్క ఇప్పుడు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరో హీరోను వెదికే పనిలో బుచ్చిబాబు బిజీగా ఉన్నాడట.. ఓ యంగ్ హీరోను సంప్రదించాడని.. ఇది త్వరలోనే పట్టాలెక్కనుందని సమాచారం.

ఇప్పటికే టాలీవుడ్ అగ్రదర్శకులంతా పెద్ద హీరోలతో సినిమాలన్నీ లాక్ చేసేశారు. చిన్న హీరోల చేతిలోనూ రెండు మూడు సినిమాలున్నాయి. దీంతో అనిల్ రావిపూడి సహా యువ సెన్షేషనల్ డైరెక్టర్స్ అంతా కూడా హీరోలు లేక కథలు పట్టుకొని ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.