Comedian Prudhvi Raj Health: ప్రముఖ సీనియర్ కమెడియన్ పృద్వి రాజ్ తీవ్రమైన అస్వస్థతో కాసేపటి క్రితమే హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. షూటింగ్ కార్యక్రమం లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పృథ్వి రాజ్, ఒక్కసారిగా లొకేషన్ లోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత మూవీ యూనిట్ ఆయనని వెంటనే హాస్పిటల్ కి తరలించి అత్యవసర చికిత్స అందించారు. అయితే ఆయనకీ ఎందువల్ల అస్వస్థత కి గురి అయ్యాడు అనే విషయం మాత్రం బయటకి రాలేదు.
ఇన్ని రోజులు నటుడిగా ఇండస్ట్రీ లో కొనసాగిన పృథ్వి ఇప్పుడు దర్శకుడిగా మారి ‘కొత్త రంగుల ప్రపంచం’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఆయన నటిస్తూ మరో పక్క దర్శకత్వం వహిస్తున్నాడు. దీనితో తీవ్రమైన అలసట రావడం వల్లే ఆయన అలా కుప్పకూలిపోయాడని తెలుస్తుంది.అయితే స్పృహ లోకి వచ్చిన తర్వాత హాస్పిటల్ బెడ్ మీద నుండి ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘ఇన్ని రోజులు మీరు నన్ను నటుడిగా ఎంతో ఎత్తులకు చేర్చారు, ఇప్పుడు నేను దర్శకుడిగా తొలి సినిమా చేస్తున్నాను.’కొత్త రంగుల ప్రపంచం’ చిత్రానికి మీ అందరి ఆశీస్సులు కావలి, ఈ నెల 26 వ తారీఖున గ్రాండ్ లెవెల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా చెయ్యబోతున్నాము. ఇలా హాస్పిటల్ బెడ్ మీద పడిఉన్నా కూడా నాకు సినిమానే గుర్తుకు వస్తుంది’ అంటూ పృథ్వి రాజ్ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడాడు.
అయితే ఎలాగో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ వీడియో బైట్ ఇవ్వడం ఎందుకు, సినిమాకి పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నారా, లేక నిజంగానే అస్వస్థతకి గురి అయ్యాడా అని నెటిజెన్స్ అనుమానపడుతున్నారు. మరి సోషల్ మీడియా లో వస్తున్న ఈ కామెంట్స్ కి పృథ్వి సమాధాన చెప్తాడో లేదో చూడాలి.