Samantha: నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం.. కెరీర్పై పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది సమంత. ఈ క్రమంలోనే వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకెళ్లిపోతోంది. మరోవైపు, ఫిట్నెస్పైనా కేర్ తీసుకుంటోంది ఈ బ్యూటీ. దీనికి తోడు ఇటీవలే సోషల్మీడియాలో ఫుల్ యాక్టీవ్గా వుంటూ.. వరసగా పోస్టులు చేస్తోంది. అయితే, తాజాగా, వీరి విడాకుల అనతరం తొలిసారి సమంత అక్కినేని కాంపౌండ్లో అడుగుపెట్టడం హాట్ టాపిక్గా మారింది.

Also Read: పూజా వద్దనుకున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్.. సమంత చేతుల్లోకి
సమంత అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్కు వచ్చినట్లు సమాచారం. చైతూతో విడాకుల అనంతరం సామ్ అన్నపూర్ణ స్టూడీయోస్కు రావడం ఇదే తొలిసారి. ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమాలో సమంత ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమలోనే ఈ సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు సామ్ అన్నపూర్ణ స్టూడియోస్ వచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు, నాగచైతన్య పుట్టినరోజు నాడు సామ్ విష్ చేయకపోవడం అదే రోజు తన కుక్క పిల్లకు బర్త్డే వేడుకలు జరపడం నెట్టింట చర్చనీయాంశమైంది. దీంతో సమంతపై నాగచైతన్య ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతంం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో ఐటెం సాంగ్లో నటిస్తోంది. దీంతో పాటు, పలు ప్రాజెక్టుల్లోనూ సామ్ కనిపించనుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్పలో రష్మిక మందన హీరోయిన్. ఈ ఏడాది డిసెంబరు 17న సినిమా విడుదలకు సిద్ధమైంది.
Also Read: ఆ పాత్రను అందుకే చేశానని మనసులో మాట చెప్పిన సమంత…