Homeఎంటర్టైన్మెంట్Samantha: నిజాయితీగా ఉండండి.. సమంత ఎమోషనల్ పోస్ట్ !

Samantha: నిజాయితీగా ఉండండి.. సమంత ఎమోషనల్ పోస్ట్ !

Samantha: హీరోయిన్ సమంత గారు ‘మీతో మీరు మీలో మీరు నిజాయితీగా ఉండండి’ అంటూ ఓ భావోద్వేగమైన మెసేజ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉన్నట్టు ఉండి సమంత ఈ సందేశాన్ని ఎందుకు పోస్ట్ చేసింది అంటే.. కొత్త ఏడాది కదా. అందుకే, కాస్త కొత్తగా ఆలోచించి మొత్తానికి ఈ కొత్త మెసేజ్ ను పోస్ట్ చేసింది. ఏది ఏమైనా 2021 సంవత్సరం సమంతకు ఎప్పటికీ మర్చిపోలేని ఓ చేదు జ్ఞాపకం.

Samantha
Samantha

నాగచైతన్యతో విడాకుల వ్యవహారం, అలాగే సామ్ ఎఫైర్లు అంటూ వచ్చిన లేనిపోని పుకార్లు, ఇక ఆ పుకార్ల ప్రభావం నుంచి సమంత ఇప్పుడిప్పుడే బయట పడుతుంది. ఒక విధంగా తన జీవితంలో వచ్చిన అతి పెద్ద కష్టం నుంచి సమంత చాలా త్వరగా బయటపడినట్టే. సరే ప్రస్తుతానికి వస్తే.. రానున్న 2022 కొత్త ఏడాదికి సమంత గ్రాండ్ స్వాగతం చెప్పాలని డిసైడ్ అయింది.

అందుకే, పాత జ్ఞాపకాలన్నిటినీ మరచిపోవాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో బాధలన్నిటినీ మర్చిపోయింది. మరి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అంటే, గతం తాలూకు చేదు జ్ఞాపకాలను వదిలేయాలి కదా. కాబట్టి వదిలేసింది. ఊరికినే వదిలేస్తే ఏం బాగుంటుంది. అందుకే, తన ఇన్ స్టా అకౌంట్ లో ఒక ఎమోషనల్ మెసేజ్ ను షేర్ చేసింది.

Also Read: Radhe Shyam: వాయిదా వైపే అడుగులా ? ‘రాధేశ్యామ్’ది ‘ఆర్ఆర్ఆర్’ దారేనా ?

తన పెంపుడు కుక్కల ఫోటోను పోస్ట్ చేస్తూ.. ఈ విధంగా మెసేజ్ చేసింది. ఈ 2022లో ఎంతో బలంగా, ఎంతో తెలివిగా, అలాగే దయగల వ్యక్తిగా ఉంటానని, తనతోపాటే అందరూ అలాంటి లక్షణాలు అలవరచుకోవాలని మెసేజ్ చేసింది. అలాగే మీ అతి పెద్ద లక్ష్యం దూరంగా కనిపిస్తే, సాధారణ జీవితాన్ని కూడా సంతోషంగా, పండగలా గడపండి, అన్ని విజయాలు వరిస్తాయి’ అంటూ సమంత మెసేజ్ పోస్ట్ చేసింది.

Also Read: Induvadana Telugu Movie Review: `ఇందువదన` రివ్యూ

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version