‘క్రాక్’ మూవీ చేస్తూనే రవితేజ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘హలో గురు ప్రేమకోసమే’ మూవీ చేసిన త్రినాధరావుతో సినిమా చేసేందుకు రవితేజ ఒపుకున్నారట. రామ్ హీరోగా నటించిన ఈ మూవీ మంచి విజయాన్నే సాధించింది. రవితేజతో త్రినాథరావు తెరకెక్కించే మూవీని పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించనుందని సమాచారం.
అదేవిధంగా రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమాకు అంగీకరించినట్లు తెలుస్తోంది. రవితేజ సినిమాలు ఫ్లాపుల్లో ఉన్నా దర్శక, నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. వచ్చిన అవకాశాలను రవితేజ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ రెండు మూవీలను ఒకేసారి లైన్లో పెట్టిన రవితేజ త్వరలో పట్టాలెక్కే పనిలో పడ్డాడు. త్వరగా ప్లాపుల నుంచి బయటపడి మునుపటిగా సక్సస్ హీరోగా మారాలనుకుంటున్నాడు. ఈ మూడింటిలో ఏ మూవీ హిట్టయినా రవితేజ మళ్లీ హిట్టు ట్రాక్ పడట్లే. రవితేజకు ఏ మూవీ హిట్టు ఇస్తుందో వేచి చూడాల్సిందే.