
2016 లో కన్నడ చిత్రం `కిరాక్ పార్టీ ` తో సినీ పయనం స్టార్ట్ చేసిన రష్మిక మందన్న కెరీర్ లో విజయాల శాతం ఎక్కువే …2018 లో తెలుగు నాట అడుగు పెట్టి ఇక్కడ కూడా వూహించ విజయాలు అందుకొంది/ మొదటి చిత్రం `చలో` తరవాత ” గీత గోవిందం ” చిత్రం తో బ్లాక్ బస్టర్ విజయాన్నిఅందుకొంది తరువాత `దేవదాస్ . డియర్ కామ్రేడ్ ` చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక 2020 లో వచ్చిన ” సరిలేరు నీకెవ్వరు ” , ” భీష్మ” చిత్రాలు సూపర్ సక్సెస్ సాధించాయి .
అలా వరుస హిట్ లతో రష్మిక మందన్న దూసుకు పోతుంటే నిర్మాతలు మునుపటి కంటే ఎక్కువ పారితోషికం ఆఫర్ చేస్తున్నారు .. అయితే కరోనా సంక్షోభం వల్ల చిత్ర పరిశ్రమ పరిస్థితి బాగా దెబ్బ తినడంతో మళ్ళీ అందరి పారితోషికాలు తగ్గే సూచనలు కనపడుతున్నాయి. ..ముఖ్యంగా హీరో , హీరోయిన్ల పారితోషికాలలో భారీ కోతలు పడనున్నాయి . ఆ ప్రాసెస్ లో హీరోలు కూడా ఇప్పటికే తమ సమ్మతం తెలిపినట్టు తెలుస్తోంది . రష్మిక మందన్న కూడా అగ్ర హీరోయిన్ కనుక ఆమె కూడా పారితోషికం తగ్గించుకోక తప్పదు. వెరసి రష్మిక మందన్న పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు అయ్యింది .హిట్ చిత్రా లున్నప్పటికీ పారితోషకం పెంచడానికి వీలు లేకుండా పోతోంది .