Rashmi Gautam- Sowmya Rao: జబర్దస్త్ కి కొత్త యాంకర్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ కన్నడ భామతో రష్మీ గొడవకు దిగింది. నువ్వు రాగానే నేను వెళ్లిపోవడానికి పాత యాంకర్స్ అనుకుంటున్నావా? అని అడిగేసింది. నయా యాంకర్ కూడా ఏమాత్రం తగ్గకుండా షాకింగ్ రిప్లై ఇచ్చింది. దీంతో అక్కడే ఉన్న జడ్జి ఇంద్రజ కలగజేసుకున్నారు. విషయంలోకి వెళితే… శ్రీదేవి డ్రామా కంపెనీ 100వ ఎపిసోడ్ కి చేరుకుంది. ఈ స్పెషల్ ఎపిసోడ్ ని మరింత ప్రత్యేకంగా, ఫుల్ ఎంటర్టైనింగ్ తీర్చిదిద్దాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. దానిలో భాగంగా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్స్, కమెడియన్స్ ని రంగంలోకి దింపారు.

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో రష్మీ ఆల్రెడీ చేస్తున్నారు. 100వ ఎపిసోడ్ లో కొత్త యాంకర్ సౌమ్యరావు కూడా పాల్గొన్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై సౌమ్యరావుని చూసిన రష్మీ వాదనకు దిగారు. ఆ ముగ్గురు పాత యాంకర్స్ లాగా … కొత్త యాంకర్ రాగానే వెళ్ళిపోతాను, అనుకుంటున్నావా? అంది. రష్మీ డైలాగ్ కి సౌమ్యరావు తగ్గకుండా టైమింగ్ కౌంటర్ వేసింది. జబర్దస్త్ పాత యాంకర్స్ ముగ్గురు కాదు… నీతో కలిపి నలుగురు, అని సెటైర్ వేసింది. రష్మీ-సౌమ్యరావు మధ్య మాటలు పెరుగుతుండగా… జడ్జి ఇంద్రజ ఎంటర్ అయ్యారు.
మీలో ఎవరు జబర్దస్త్ యాంకర్ గా ఉండాలో తేల్చడానికి పోటీ పెట్టుకుందాం. ఇద్దరూ మీ టీమ్స్ ని సిద్ధం చేసుకొని పెర్ఫార్మన్స్ ఇవ్వండి. బాగా ఎంటర్టైన్ చేసిన టీమ్ గెలిచి జబర్దస్త్ యాంకర్ గా కొనసాగవచ్చని ఛాలెంజ్ ఇచ్చారు. రష్మీ-సౌమ్య ఆ ఛాలెంజ్ ఒప్పుకొని దుమ్మురేపే పెర్ఫార్మన్స్ లు ఇచ్చారు. సౌమ్యరావు హాఫ్ శారీలో పుష్ప చిత్రంలోని ‘చూపే బంగారమాయెనే’ సాంగ్ కి డాన్స్ వేశారు. ఇక రష్మీ మాచర్ల నియోజకవర్గం మూవీలోని హిట్ సాంగ్ ‘రెడ్డి’ సాంగ్ కి మాస్ స్టెప్స్ తో కేకపుట్టించారు.

అయితే రష్మీ-సౌమ్య మధ్య చోటు చేసుకున్న ఈ వివాదం కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే. నిజంగా వారు ఎలాంటి గొడవపడలేదు. కాగా అనసూయ జబర్దస్త్ మానేశాక ఆ ప్లేస్ లో రష్మీ కొనసాగారు. కొన్ని వారాల తరువాత సౌమ్యరావుని జబర్దస్త్ యాంకర్ గా తీసుకున్నారు. సౌమ్యరావు రాకతో రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ కి పరిమితమైంది. ఒక విధంగా చెప్పాలంటే జబర్దస్త్ ద్వారా వచ్చే ఆదాయం కోల్పోయారు. కొత్త యాంకర్ సౌమ్యరావు ఎంట్రీపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదని రష్మీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.