
దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరెకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. వీరిద్దరి ఒకేమూవీలో స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురంభీం పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇటీవల ఈ మూవీ టైటింగ్, మోషన్ పోస్టర్ రిలీజై అభిమానుల్లో సినిమాపై అంచనాలను పెంచేశాయి.
‘ఆర్ఆర్ఆర్’లో రాంచరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా నటిస్తున్నారు. అలాగే సీనియర్ హీరోయిన్ శ్రియ, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ హీరోయిన్ ఒలీవియా గతంలో కొన్నిరోజులు షూటింగ్ పాల్గొని తిరిగి హాలీవుడ్ వెళ్లింది. ఇంకా ఆమె కొన్ని సన్నివేశాలను చిత్రీకరించేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా ‘ఆర్ఆర్ఆర్’లో ఇప్పటివరకు బాలీవుడ్ భామ అలియా భట్ ఒక్క సీన్లో కూడా పాల్గొన లేదు. లాక్ డౌన్ కారణంగా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ వాయిదా పడిన సంగతి తెల్సిందే.
దేశంలో లాక్ డౌన్ ఎత్తేయగానే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తోంది. అలియాభట్ అందాల అరబోతతో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని ప్రచారం జరుగుతుంది. రాజమౌళి ముందుగా చెర్రీ-అలియాలపై ఓ స్పెషల్ సాంగ్ తెరకెక్కించి ఆ తర్వాత మిగతా షూటింగ్ ను తెరకెక్కించేందుక ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అలియా రాగానే చెర్రీ రోమాన్స్ మొదలవనుందట. ఇక ఈ సినిమాను 2021 జనవరి 8న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది.