
ఊహలు గుసగుస లాడే `చిత్రం తో తెరంగేట్రం చేసిన రాసి ఖన్నా అందం, అభినయం రెండూ ఉన్న కథానాయిక అనే చెప్పాలి. తొలి సినిమాలోనే ఆమె ఈ రెండు విషయాల్లో ప్రూవ్ చేసుకొంది. కానీ చేసింది చిన్న సినిమా కావడంతో పెద్ద సినిమాల్లో ఇంకా ఛాన్స్ రాలేదు. దాంతో సెకండ్ గ్రేడ్ హీరోయిన్గానే కొనసాగుతోంది. ఆ మధ్య ‘జై లవకుశ’ చిత్రం లో ఎన్ టి ఆర్ సరసన నటించినా కానీ దాని వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది.
తెలంగాణలో మరో రెండు వారాలు లాక్ డౌన్!
ఇక 2018 లో వచ్చిన ‘తొలి ప్రేమ’ మరియు 2019 లో వచ్చిన ” ప్రతిరోజూ పండగే” సినిమా లతో టాలెంటెడ్ అని ప్రూవ్ అయినా కానీ రాశి ఖన్నా కోరుకున్న స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. దరిమిలా తమిళంలోకి వెళ్లి చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది రాశి ఖన్నా. ఆ క్రమంలో తమిళ స్టార్ హీరో సూర్య సరసన ” ఆరువా ” అనే చిత్రం లో నటించబోతోంది. సింగం ఫేమ్ హరి దర్శకత్వంలో రూపొందే ఈ ” ఆరువా ” చిత్రం లాక్ డౌన్ ఎత్తగానే ప్రారంభం అవుతుంది.. దీంతో పాటు ఖుష్బూభర్త సి . సుందర్ దర్శకత్వంలో ‘ఆరణ్మయి-3’ అనీ సినిమా కూడా \ఆమె చేస్తున్నట్టు చెప్పింది.. ఈ వివరాలన్నీ తాజాగా ట్విట్టర్ చిట్ చాట్లో వెల్లడించింది. ఐతే తెలుగులో మాత్రం రాశి ఖన్నా తన కొత్త సినిమాల వివరాలు తెలియ చేయలేదు.