రవితేజ మూవీలో రాశీ ఖన్నా ఐటమ్‌ సాంగ్!

టాలీవుడ్‌లో ఇప్పుడు రాశీ ఖన్నా జోరు నడుస్తోంది. ‘ఊహలు గుసగుసలాడే’తో తెరంగేట్రం చేసిన ఈ ఢిల్లీ భామ ఇప్పుడు సీనియర్, జూనియర్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తోంది. తన గ్లామర్తో తెలుగుతో పాటు తమిళంలోనూ కూడా అవకాశాలను అందుకుంటోంది. ఈ మధ్యే తెలుగులో రెండు సినిమాలకు ఆమె సైన్‌ చేసింది. అందులో ఒకటి ‘ఆర్ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్న ‘మహా సముద్రం’ అని సమచారం. ఈ మూవీలో శర్వానంద్, సిద్దార్థ్‌ నటిస్తున్నారు. సిద్దార్థే […]

Written By: Neelambaram, Updated On : July 9, 2020 7:59 pm
Follow us on


టాలీవుడ్‌లో ఇప్పుడు రాశీ ఖన్నా జోరు నడుస్తోంది. ‘ఊహలు గుసగుసలాడే’తో తెరంగేట్రం చేసిన ఈ ఢిల్లీ భామ ఇప్పుడు సీనియర్, జూనియర్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తోంది. తన గ్లామర్తో తెలుగుతో పాటు తమిళంలోనూ కూడా అవకాశాలను అందుకుంటోంది. ఈ మధ్యే తెలుగులో రెండు సినిమాలకు ఆమె సైన్‌ చేసింది. అందులో ఒకటి ‘ఆర్ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్న ‘మహా సముద్రం’ అని సమచారం. ఈ మూవీలో శర్వానంద్, సిద్దార్థ్‌ నటిస్తున్నారు. సిద్దార్థే విలన్‌ అని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో ఇప్పటికే ఒక హీరోయిన్‌గా అదితీ రావ్‌ హైదరీని సెలెక్ట్‌ చేశారు. మరో హీరోయిన్‌గా రాశీ ఖన్నాను ఖరారు చేసినట్టు సమాచారం.

కొత్త సచివాలయ నిర్మాణానికి కారణాలు ఇవేనా!

సిద్దార్థ పక్కన అదితి, శర్వాకు జోడీ రాశీ నటిస్తారని అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ మూవీ కరోనా భయం తొలిగాక సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. మరోవైపు రమేశ్‌ వర్మ డైరెక్షన్‌లో రవితేజ చేస్తున్న మూవీకి కూడా రాశీ ఎంపికైందట. అయితే హీరోయిన్‌గా కాదు. మాస్‌ మహారాజతో ఓ ఐటమ్‌ సాంగ్‌ కోసం రాశీ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. రవితేజతో ఇప్పటికే రెండు చిత్రాలు చేయడంతో అడిగిన వెంటనే ఐటమ్‌ సాంగ్‌కు ఆమె ఒప్పుకుందట. దాంతో, తమన్నా, కాజల్‌ మాదిరిగా హీరోయిన్‌గా ఫుల్‌ ఫామ్‌లో ఉండగానే స్పెషల్ సాంగ్స్‌‌ బాటలోకి రావాలని రాశీ కూడా ఫిక్స్‌ అయినట్టుంది. మరోవైపు తమిళ్‌లో కూడా ఈ ఢిల్లీ బ్యూటీ జోరు నడుస్తోంది. కోలీవుడ్‌లో ఆమె మూడు సినిమాలు చేస్తోంది.