పవన్ వ్యాఖ్యలకు సంచలన కౌంటర్ ఇచ్చిన  నిర్మాత దిల్ రాజు

జనసేనాని పవన్ రాజేసిన మాటల మంటలు సినీ ఇండస్ట్రీకి అంటుకున్నాయి. వెంటనే టాలీవుడ్ నిర్మాతలంతా కలిసి కట్టుకొని వెళ్లి ఏపీలో వాలిపోయారు. నిన్న పవన్ కు కౌంటర్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని మచిలీపట్నం వెళ్లి మరీ వారింట్లో కలిశారు. నిర్మాతలు దిల్ రాజు, సునీల్ నారంగ్, మైత్రీ నవీన్, డీవీవీ దానయ్య సహా కీలక సినీ పెద్దలు మంత్రి పేర్ని నానితో సమావేశమై పవన్ వ్యాఖ్యలను ఖండించినట్టు సమాచారం. అనంతరం చిరంజీవి కూడా మంత్రి […]

Written By: NARESH, Updated On : September 29, 2021 7:35 pm
Follow us on

జనసేనాని పవన్ రాజేసిన మాటల మంటలు సినీ ఇండస్ట్రీకి అంటుకున్నాయి. వెంటనే టాలీవుడ్ నిర్మాతలంతా కలిసి కట్టుకొని వెళ్లి ఏపీలో వాలిపోయారు. నిన్న పవన్ కు కౌంటర్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని మచిలీపట్నం వెళ్లి మరీ వారింట్లో కలిశారు. నిర్మాతలు దిల్ రాజు, సునీల్ నారంగ్, మైత్రీ నవీన్, డీవీవీ దానయ్య సహా కీలక సినీ పెద్దలు మంత్రి పేర్ని నానితో సమావేశమై పవన్ వ్యాఖ్యలను ఖండించినట్టు సమాచారం.

అనంతరం చిరంజీవి కూడా మంత్రి పేర్ని నానితో మాట్లాడి పవన్ వ్యాఖ్యలతో విభేదించారని..విచారం వ్యక్తం చేశారని మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ఎప్పటి నుంచో ఉంది. ఇది ప్రభుత్వం కొత్త గా ప్రవేవ పెట్టింది కాదు. సినీ పరిశ్రమ ఆన్ లైన్ టికెట్ బుకింగ్ కు అనుకూలంగా ఉందని చెప్పారు. తాను జగన్ పాలేరునేనని.. నువ్వు ఎవరి పాలేరువో చెప్పే దమ్ముందా అంటూ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు.

మంత్రి పేర్ని నాని మాట్లాడిన అనంతరం నిర్మాత దిల్ రాజు మాట్లాడారు.. ‘చిత్రపరిశ్రమను వివాదాల్లోకి లాగవద్దు అని విన్నవించారు. సినిమా టికెట్ల రేట్లు పెంచమని మేమే కోరామన్నారు. దాని గురించి గత సమావేశంలోనే చర్చించామన్నారు. మంత్రి నాని సానుకూలంగా స్పందించారని వివరించారు. దాన్ని పూర్తి స్థాయిలో సినీ పరిశ్రమకు వివరించలేకపోయామన్నారు. అందుకే ఇలాంటి పరిస్థితి ఎదురైందన్నారు.అనుకోని పరిణామాలు జరుగుతున్నాయని’ పవన్ వ్యాఖ్యలను పరోక్షంగా నిర్మాత దిల్ రాజు తప్పుపట్టారు.

ఏపీలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానితో టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, బన్నీవాసు తదితరులు మంగళవారం మచిలీపట్నంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ, ఇతర ఇబ్బందులపై వారు చర్చించారు. అనంతరం పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి నాతో మాట్లాడారని తెలిపారు. సినీ ఫంక్షన్ లో జరిగిన ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారని నాని పేర్కొన్నారు.