Prakash Raj: ప్రకాష్ రాజ్ ఏర్పాటు చేయబోయే… అసోసియేషన్ పేరు ఏంటో తెలుసా ?

Prakash Raj: గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నడిచిన అంశం ఏదైనా ఉంది అంటే అది మా అసోసియేషన్ ఎన్నికలే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకొని రచ్చకెక్కారు. అయితే ప్రకాశ్​రాజ్​కు పోటీగా నిలబడిన మంచు విష్ణు గెలిచిన సంగతి తెలిసిందే. కానీ ఎలక్షన్స్ అనంతరం కూడా మా ఎన్నికలు వివాదం రోజురోజుకూ ఓ కొత్తమలుపు తీసుకుంటోంది. ఇప్పుడు మా కు పోటీగా మరో అసోసియేషన్​ను […]

Written By: Raghava Rao Gara, Updated On : October 12, 2021 4:58 pm
Follow us on

Prakash Raj: గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నడిచిన అంశం ఏదైనా ఉంది అంటే అది మా అసోసియేషన్ ఎన్నికలే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకొని రచ్చకెక్కారు. అయితే ప్రకాశ్​రాజ్​కు పోటీగా నిలబడిన మంచు విష్ణు గెలిచిన సంగతి తెలిసిందే. కానీ ఎలక్షన్స్ అనంతరం కూడా మా ఎన్నికలు వివాదం రోజురోజుకూ ఓ కొత్తమలుపు తీసుకుంటోంది. ఇప్పుడు మా కు పోటీగా మరో అసోసియేషన్​ను ప్రకాశ్​రాజ్​… సహా మరి కొంత మంది సభ్యులు స్థాపించనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రకాశ్​రాజ్​ మీడియా ముందుకు రానున్నారు. ఇప్పటికే ప్రకాశ్​రాజ్​ సహా నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

వృకి మద్దతుగా మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా కూడా వారి దారిలోనే నడుస్తానని స్పష్టం చేశారు. దీంతో మా అసోసియేషన్ లో గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు తన రాజీనామా వెనక లోతైన అర్థం ఉందని త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇస్తానని ట్విట్టర్​ వేదికగా ప్రకాశ్​రాజ్​ తెలిపారు.  ఈ నేపథ్యంలో కొత్త కూటమి పెట్టే అంశంపై మరింత చర్చలు మొదలయ్యాయి. కాగా వీరి ప్యానల్ కు ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( ఆత్మ ) అనే పేరు ఏర్పాటు చేయనున్నట్లు కధనాలు వినిపిస్తున్నాయి.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 18 కార్యవర్గ సభ్యుల్లో 10 మంది విష్ణు ప్యానెల్‌కు చెందిన అభ్యర్థులు విజయం సాధించగా… 8 మంది ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్ అభ్యర్థులు గెలిచారు. ఫలితాలు వచ్చిన వెంటనే ప్రకాశ్‌ రాజ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రాంతీయవాదం, జాతీయ వాదం నేపథ్యంలోనే ఈ ఎన్నికలు సాగాయని చెప్పడం గమనార్హం. ఆ కారణం గానే ఆయన మా అసోసియేషన్ లో తన సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా చేస్తూ ప్రకటించారని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.