Prabhas Varsham Movie Facts: ప్రభాస్ హీరోగా ఎమ్మెస్ రాజు ప్రొడ్యూసర్ గా తెరకెక్కిన వర్షం సినిమా భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాకి శోభన్ దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే. ఇక వర్షం సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు ప్రభాస్ కి ఒక సక్సెస్ కూడా లేదు. రెండు సినిమాలు చేసిన కూడా అవి ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ప్రభాస్ ఎలాంటి సినిమాలు చేయాలి అనుకున్న సందర్భంలో ఎమ్మెస్ రాజు వర్షం సినిమా కథ చెప్పి అతనిని ఒప్పించాడు. కథ బాగుంది కానీ ఈ మూవీకి దర్శకుడిగా ఎవర్ని తీసుకుందాం అని ప్రభాస్ ఎమ్మెస్ రోజు చర్చించుకున్నారట. మొత్తానికైతే ఎమ్మెస్ రాజు శోభన్ ని తీసుకుందామని చెప్పాడట. అయితే అంతకుముందు శోభన్ మహేష్ బాబుతో బాబీ అనే సినిమా చేసి భారీ ఫ్లాప్ ని మూట గట్టుకున్నాడు.
కాబట్టి అప్పుడు ప్రభాస్ శోభన్ ఎందుకు వేరే సక్సెస్ఫుల్ దర్శకుడితో సినిమా చేసుకుందామని చెప్పారట… వి వి వినాయక్ తో ఈ సినిమా చేద్దామా అని ప్రభాస్ ఎమ్మెస్ రాజును కూడా అడిగారట. కానీ ఎమ్మెస్ రాజు మాత్రం లేదు శోభన్ చాలా టాలెంటెడ్ డైరెక్టర్ ఆయన బాగా తీస్తాడు అని చెప్పి ప్రభాస్ ను ఒప్పించాడట.
మొత్తానికైతే శోభన్ వర్షం సినిమాని నెక్స్ట్ లెవెల్ సక్సెస్ గా నిలపడమే కాకుండా తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత కాలంలో ఆయన చనిపోవడం ఇండస్ట్రీ కి చాలా పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు తన కొడుకులు అయిన సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ లు సైతం ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ వినాయక్ ను తీసుకుందామా అని ఎందుకు అడిగాడు అంటే ప్రభాస్ కి వినాయక్ కి అంతకు ముందు నుంచి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ చనువుతోనే వినాయక్ ఈ సినిమాను బాగా హ్యాండిల్ చేస్తాడనే ఉద్దేశ్యంతో అడిగారట. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ కి వర్షం సినిమా లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు…
