Homeఎంటర్టైన్మెంట్NTR- Koratala Movie Motion Poster: ఎప్పుడూ లేని విధంగా ఎన్టీఆర్ సరికొత్త యాక్షన్...

NTR- Koratala Movie Motion Poster: ఎప్పుడూ లేని విధంగా ఎన్టీఆర్ సరికొత్త యాక్షన్ విజువల్ ట్రీట్

NTR- Koratala Movie Motion Poster: కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ ఏన్టీఆర్ తో చేస్తున్న పాన్ ఇండియా సినిమా నుంచి మోషన్ పోస్టర్ వీడియో విడుదల చేశారు. ఎన్టీఆర్ గంభీరమైన డైలాగ్ తో సాగిన ఈ వీడియోలో భారీ విజువల్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. సాగర తీరంలో ఎన్టీఆర్ శత్రువులను ఊచకోత కొస్తుండగా ఆ రక్తపు ధారలకు కెరటాలు ఎరుపెక్కాయి. దుర్మార్గుల అరాచకాలు ఎక్కువై సామాన్యుడి సహనం నశిస్తే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో.. చెప్పడమే ఈ సినిమా థీమ్ లా ఈ వీడియో సాగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ డైలాగ్ మెయిన్ హైలైట్.

NTR- Koratala Movie Motion Poster
NTR

”అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు, అవసరానికి మించి తను ఉండకూదని… అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని… వస్తున్నా” అంటూ చివర్లో ఎన్టీఆర్ డైలాగ్ చెప్పిన విధానం గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. 47 సెకెన్ల ఈ మోషన్ పోస్టర్ వీడియో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ కిక్ ఇచ్చింది. ఇక ఈ సినిమా హీరోయిన్ విషయంలో ఎన్నో రూమర్లు వినిపించాయి.

Also Read: Rashmika Mandanna: స్పోర్ట్స్ వేర్ లో రష్మిక హాట్ సెల్ఫీ.. ఘాటు ఫోజులు వైరల్

ఫలానా హీరోయిన్ అంటూ రోజుకొక హీరోయిన్ పేరు వినిపించేది. ఇంతకీ, ఈ సినిమాలో ఏ హీరోయిన్ నటిస్తోందో క్లారిటీ వచ్చింది. బాలీవుడ్ బ్యూటీ ‘కియారా అద్వానీ’ని ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేశారు. కొరటాల దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ కూడా ఉంది.

ఆ ప్లేస్ లోనే క్రేజీ హీరోయిన్ సాయిప‌ల్ల‌విని తీసుకున్నారని టాక్ నడుస్తోంది. సాయి ప‌ల్ల‌వి మంచి నటి. ఆమె ఎన్టీఆర్ తో కలిసి నటిస్తే.. ఇక స్క్రీన్ షేక్ అవ్వాల్సిందే. ఇక ఆచార్య ప్లాప్ దెబ్బతో ఎన్టీఆర్ సినిమా విషయంలో అన్నీ రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కొరటాల.

NTR- Koratala Movie Motion Poster
NTR- Koratala

ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 300 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా గ్రాండ్ గా ఉండబోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శకుడు కొరటాల ఈ చిత్రాన్ని సరికొత్త యాక్షన్ విజువల్ ట్రీట్ గా మలచబోతున్నాడు.

అందుకోసం.. హాలీవుడ్ యాక్షన్ టెక్నీషియన్స్ ను పెట్టుకుంటున్నాడు. మరి చూడాలి.. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో. ఇక కొరటాల ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ ఓ సోషల్ మెసేజ్ పాయింట్ ను చెప్పబోతున్నాడు. కాగా సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే జులై నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుంది.

Also Read:HBDNTR: ఎన్టీఆర్ ఇంటి ముందు అభిమానుల గొడవ.. పోలీసుల లాఠీఛార్జ్.. ఏం జరిగిందంటే?


Recommended Videos

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular