Heroine: స్టూడెంట్ లకు బిర్యానీ పెట్టిన స్టార్ హీరోయిన్.. తర్వాత ఏం చేసిందో తెలుసా?

నయనతార రీసెంట్ గా నటించిన చిత్రం ‘ అన్నపూరణి’. ది గాడెస్ ఆఫ్ పుడ్ అనేది ఉపశీర్షికగా కలిగి ఉన్న ఈ సినిమాలో జై మరో ప్రధాన పాత్రలో నటించారు. నీలేశ్ కృష్ణ తెరకెక్కించిన ఈ తమిళ సినిమా ఈనెల ఒకటిన విడుదలైంది.

Written By: Neelambaram, Updated On : December 4, 2023 4:49 pm
Follow us on

Heroine: లేడీ సూపర్ స్టార్ నయనతార.. గ్లామరస్ పాత్రలు చేయడంతో పాటు ఫర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూ అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అంతేకాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తారల్లో ఈమె ఒకరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే ప్రచారాలను ఇష్టపడని నయన్ తాను నటించిన సినిమా ప్రచారాలకు సైతం దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అలాంటిది తాజాగా నయన్ కొంతమంది విద్యార్థులకు బిర్యానీ వడ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నయనతార రీసెంట్ గా నటించిన చిత్రం ‘ అన్నపూరణి’. ది గాడెస్ ఆఫ్ పుడ్ అనేది ఉపశీర్షికగా కలిగి ఉన్న ఈ సినిమాలో జై మరో ప్రధాన పాత్రలో నటించారు. నీలేశ్ కృష్ణ తెరకెక్కించిన ఈ తమిళ సినిమా ఈనెల ఒకటిన విడుదలైంది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి ఇండియన్ బెస్ట్ చెఫ్ గా ఎలా ఎదిగింది అనేది మూవీ కథ. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి విశేషంగా ప్రేక్షకులను ఆలరిస్తుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం చెన్నైలోని ఓ లేడీస్ కాలేజీని సందర్శించారు.

లంచ్ టైమ్ కి వెళ్లి వారితో ముచ్చటించారు జై, నయనతార..స్టూడెంట్స్ తో సరదాగా మాట్లాడుతూ వారికి స్వయంగా నయనతార బిర్యానీ వడ్డించారు. ఈ విధంగా విద్యార్థినీలకు జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాన్ని అందించారు. తమ అభిమాన తార స్వయంగా రావడంతో స్టూడెంట్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.. అయితే ఎప్పుడు మూవీ ప్రచారాలకు దూరంగా ఉండే నయనతార ఇప్పుడిలా చేయడం విశేషం.. కాగా ప్రస్తుతం నయనతార డైరెక్టర్ శశికాంత్ దర్శకత్వం వహిస్తున్న టెస్ట్ సినిమాతో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.