spot_img
Homeఎంటర్టైన్మెంట్New Trains: మోడీగారి కొత్త రైళ్లు.. ఈసారి పేదలకు.. ఫీచర్స్ చూస్తే దిమ్మదిరిగాల్సిందే

New Trains: మోడీగారి కొత్త రైళ్లు.. ఈసారి పేదలకు.. ఫీచర్స్ చూస్తే దిమ్మదిరిగాల్సిందే

New Trains: వందే భారత్‌ పేరుతలో సంపన్నుల ప్రయాణాన్ని సౌకర్యవంతం, వేగవంతం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు పేదల సౌకర్యంపై దృష్టిసారించారు. ఇప్పటికే వందేభారత్‌ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతుండగా, త్వరలో అదే తరహాలో పేదల రైళ్లను పట్టాలెక్కించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.

రైల్వేపైనే ఎక్కువ శ్రద్ధ..
కేంద్రంలోని నరేంద్రమోదీ దేశంలో రైల్వేపై ఎక్కువ దృష్టిపెట్టారు. కొత్తకొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే వందేభారత్‌ రైళ్ల పేరుతో దాదాపు దేశమంతటా వేగవంతమైన రైళ్లు వచ్చాయి. ఇదే తరహాలో ఇక పేదలకు రైళ్లను ప్రవేశపెట్టేందకు మోదీ ప్రణాళిక సిద్ధం చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే అమృత్‌ భారత్‌ పేరుతో పేదల రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి.

వేగవంతమైన ప్రయాణమే లక్ష్యంగా..
దేశంలో రైలు ప్రయాణికులను త్వరగా, సౌకర్యవంతంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా మోదీ రైల్వేలను ఆధునికీకరిస్తున్నారు. ధర కాస్త ఎక్కువే అయినా, ప్రయాణం మాత్రం వేగవంతంగా జరుగుతోంది. దీంతో రైలు ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వందేభారత్‌ రైళ్లు విజయవంతం కావడంతో ఇప్పుడు అమృత్‌ భారత్‌పై దృష్టిపెట్టారు. మరి ఈ రైళ్లలో ప్రత్యేకత ఏంటి.. ఎలాంటి సౌకర్యలు ఉంటాయి అన్న విషయాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

మొదట రెండు రైళ్లు..
అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను భారత రైల్వే వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో ఎన్నికలు ఉండడంతో వీలైనన్ని ఎక్కువ మార్గాల్లో అమృత్‌ భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. డిసెంబర్‌ 30న మొదటగా రెండు రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఒక రైలును ఢిల్లీ – దర్భంగా(బిహార్‌) మధ్య మరో రైలును బెంగాల్‌లోని మల్దా – బెంగళూరు మధ్య నడిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అమృత్‌ భారత్‌ ఫీచర్స్‌ ఇవే..
ఇక అమృత్‌ భారత్‌ రైళ్లను వందేభాత్‌ తరహాలోనే డైనమిక్‌గా డిజైన్‌ చేశారు. ఈ రైలులో 22 కోచ్‌లు ఉంటాయి. ఇందులో 8 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు, 12 సెకండ్‌ క్లాస్‌ త్రీటైర్‌ స్లీపర్‌ కోచ్‌లు, రెండు గార్డు కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. ఈరైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఎక్కువ దూరాలకు తక్కువ ఖర్చుతో అత్యంత వేగంగా, సౌకర్యవంతంగా వెళ్లడమే ఈ అమృత్‌ భారత్‌ రైళ్ల లక్ష్యం. ఇక ఈ రైళ్లలో సీసీటీవీ కెమెరాలు, ప్రతీ సీటువద్ద మొబైల్‌ చార్జింగ్‌ పాయింట్, వాక్యూమ్‌ టాయిలెట్స్, సెన్సార్‌ ట్యాప్స్‌ ఏర్పాటు చేశారు. ఆధునిక డిజైన్, ఆకట్టుకునే రంగు, సౌకర్యవంతమైన సీట్లతో బెర్తులను తయారు చేశారు. ఈ రైళ్లకు ముందు, వెనుక ఇంజిన్లు ఉంటాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ...
Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Nagarjuna

Nagarjuna: నాగార్జున కొడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే...
Abhishek Sharma

Abhishek Sharma: టీమిండియా వర్సెస్ జింబాబ్వే: అరుదైన ఘనతకు చేరువలో అభిషేక్ శర్మ..

Abhishek Sharma: పొట్టి క్రికెట్ ఫార్మాట్లో టీమ్ ఇండియాకు తిరుగులేని ఆయుధం లాంటి ఆటగాడు అభిషేక్ శర్మ. అతడికి ఫామ్ తో సంబంధం ఉండదు. బౌలర్ ఎవరనేది లెక్క ఉండదు. మైదానం...
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఆ 15 ఏళ్ల బుడ్డోడు బ్యాటర్ కాదు డైనమైట్.. టీమిండియా బౌలింగ్ దిగ్గజం షాకింగ్ కామెంట్స్

Vaibhav Suryavanshi: హర్భజన్ సింగ్.. టీమ్ ఇండియాలో లెజెండరీ స్పిన్ బౌలర్. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే న్యూజిలాండ్ వరకు ప్రతి జట్టు మీద అతడికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అతడు గూగ్లీ...
Oktelugu Epaper