Homeఎంటర్టైన్మెంట్ఆయన బుద్ది ఏమైంది ? ఆయన ఇలా ఎలా రాశారు ?

ఆయన బుద్ది ఏమైంది ? ఆయన ఇలా ఎలా రాశారు ?

Nagi Reddy and Chakrapani: తెలుగు సినీ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది ‘పాతాళభైరవి’. అందుకే మళ్ళీ అలాంటి మరో సినిమా రాదు అన్నారు. కానీ, ‘మిస్సమ్మ’ అనే చిత్రం వచ్చింది. ‘పాతాళభైరవి’ కంటే ఎక్కువ కలెక్షన్స్ ను రాబట్టి.. టాలీవుడ్ కి ఓ మైలురాయిగా నిలిచిపోయింది. కానీ ఈ చిత్రం విషయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు ఈ చిత్ర రచయిత చక్రపాణి.
Nagi Reddy and Chakrapani
అవి 1955 కాలం నాటి రోజులు. నాగిరెడ్డి, చక్రపాణి అంటే.. తెలుగు సినిమాని శాసిస్తోన్న దిగ్గజాలుగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. కానీ చక్రపాణిలో నిర్మాత కంటే కూడా మంచి రచయిత ఉన్నాడు. అందుకే, చక్రపాణి ఒక కథ రాస్తే.. ఇక ఆ కథతోనే సినిమా తీసేవారు. ‘మిస్సమ్మ’ విషయంలోనూ ఇదే జరిగింది. కానీ ఈ కథ పై అప్పటి సినీ ప్రముఖులు అనేక విమర్శలు చేశారు.

‘చక్రపాణి గారి బుద్ది ఏమైంది ? ఇలాంటి దిగజారుడు కథ ఎలా రాశారు ?. నిజమే.. యాభై యేళ్ళ కిందట, ఒక పెళ్ళి కాని అమ్మాయి సరిగ్గా పరిచయమైనా లేని ఓ పరాయి అబ్బాయిని నమ్మి అతనికి భార్యగా నెలల తరబడి నటించడానికి వేరే ఊరు వెళ్తుంది. ఈ కథాంశాన్ని ఇప్పుడు చెప్పిన నమ్మశక్యంగా ఉండదు. పైగా అప్పట్లో ఇలాంటి ఆలోచనలను అసలు సహించేవారు కాదు.

కానీ, నమ్మశక్యం కానీ ఈ పాయింట్ తోనే కథ రాసి, పైగా సినిమాని కూడా నిర్మించి గొప్ప విజయాన్ని సాధించారు చక్రపాణి. అయితే ఈ చిత్రం ఎంత గొప్ప విజయాన్ని సాధించినా.. ఆయన మాత్రం ఎప్పుడు ఈ చిత్రం ప్రస్తావన వచ్చినా బాధ పడేవారట. కారణం, తన ప్రాణ స్నేహితుడు నాగిరెడ్డి కూడా తనను ఈ చిత్రం విషయంలో సరిగ్గా అర్ధం చేసుకోలేదని, మొదట్లో అందరిలాగే నాగిరెడ్డి కూడా తనను విమర్శించాడని చక్రపాణి గారు బాధ పడుతూ ఉండేవారు.

చక్రపాణి – నాగిరెడ్డి స్నేహం అంత గొప్పగా ఉండేది. వారి స్నేహం చూసి చాలామంది కుళ్లుకునే వారు. ఇద్దరిని విడదీయడానికి అప్పటి నిర్మాతలు, హీరోలు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారట. ‘ఆ చక్రపాణితో సినిమా వ్యాపారం మానుకో, లేకపోతే మీకే ఎక్కువ నష్టం’ అంటూ నాగిరెడ్డితో తరుచూ చాలామంది అంటుండేవారట. అయితే, తమ మధ్య ఎంతమంది ఎన్ని గొడవలు పెట్టే ప్రయత్నం చేసినా చక్రపాణి – నాగిరెడ్డి చివరి వరకు కలిసే ఉన్నారు.

Also Read: Samantha: అరెరే.. సమంత తగ్గించింది, చైతు పెంచాడు

పైగా వాళ్ళు ఎన్నో చూశారు, తమ చేతుల్లోనే తెలుగు సినిమా వర్ధిల్లుతున్న రోజులను చూశారు, జీరోలను హీరోలుగా మార్చిన అనుభవాలను చూశారు. నిజమైన మల్టీ స్టారర్ సినిమాలకు ప్రాణం పోసిన సృష్టికర్తలుగా పేరు గడించారు. చివరి రోజుల్లో తక్కువ స్థాయి వ్యక్తిల నుంచి అవమానాలను కూడా ఎదుర్కొన్నారు.

Also Read: Sarkaru Vari Pata: ‘సర్కారు వారి పాట’ నుంచి ఇప్పట్లో ఎలాంటి అప్​డేట్స్ లేనట్లేనా?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular